క‌రోనా బులిటెన్ః మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజే క‌రోనాతో 295 మృతి

| Edited By:

Aug 26, 2020 | 9:00 PM

మ‌హారాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,888 కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వ‌గా, 295 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,18,711కి, మరణాల సంఖ్య 22,794కి చేరింది. కాగా ఇప్పటి వరకు 5,22,427 మంది కోలుకోగా..

క‌రోనా బులిటెన్ః మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజే క‌రోనాతో 295 మృతి
Maharashtra Coronavirus
Follow us on

దేశంలో కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తూనే ఉంది. అటు మ‌హారాష్ట్ర‌లో కూడా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ప్ర‌తీ రోజూ వేల్లో కొత్త కేసులు, వంద‌ల్లో మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. గ‌త కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ వేలల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,888 కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వ‌గా, 295 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,18,711కి, మరణాల సంఖ్య 22,794కి చేరింది. కాగా ఇప్పటి వరకు 5,22,427 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,72,873 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా మ‌హారాష్ట్ర‌లో భారీగానే న‌మోదవుతున్నాయి. శ‌నివారం కూడా కొత్త‌గా 295 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 22,794కు చేరింది.

Read More:

క‌రోనా ఎఫెక్ట్ః ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

సూర్యని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారుః భార‌తీరాజా

డీప్ కోమాలోనే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు