డీప్ కోమాలోనే ప్రణబ్ ముఖర్జీః ఆర్మీ ఆస్పత్రి వైద్యులు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో ప్రణబ్ హెల్త్ కండీషన్ గురించి ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వివరించారు. ప్రణబ్ వెంటిలేటర్పైననే చికిత్స తీసుకుంటున్నారని..
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో ప్రణబ్ హెల్త్ కండీషన్ గురించి ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వివరించారు. ప్రణబ్ వెంటిలేటర్పైననే చికిత్స తీసుకుంటున్నారని, ఆయన ఇంకా డీప్ కోమాలోనే ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రణబ్ శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలు మాత్రం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ప్రస్తుతం ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
కాగా ఈ నెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్ ముఖర్జీకి వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో ప్రణబ్కు కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.
Former President Pranab Mukherjee is being treated for lung infection. His renal parameters are slightly deranged since yesterday. He continues to be in deep coma and on ventilator support: Army Hospital (R&R), Delhi Cantt (File pic) pic.twitter.com/OVwFmuMxps
— ANI (@ANI) August 26, 2020
Read More:
బ్రేకింగ్ః తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్