Lok Sabha Election 2024 Phase 2 Voting LIVE: జమ్మూ సహా పలు రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్.. త్రిపుర-ఛత్తీస్గఢ్లో అత్యధిక ఓటింగ్
Lok Sabha Election 2024 Phase 2 Voting Live News and Updates in Telugu: దేశవ్యాప్తంగా రెండోదశ పోలింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లో 88 లోక్సభ స్థానాల్లో ఓటేసేందుకు ఉదయం 7 గంటల నుంచే బారులతీరారు. కేరళలో మొత్తం 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
Lok Sabha Election 2024 Phase 2 Voting Live: ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల్లో భాగంగా 102 స్థానాలకు పోలింగ్ జరిగిన తర్వాత రెండో దశ ఓటింగ్ ఇవాళ అంటే ఏప్రిల్ 26న జరుగుతోంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ దశలో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం రెండో విడతలో 89 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, మధ్యప్రదేశ్లోని బేతుల్ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలవి మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దీంతో 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 89 స్థానాల్లో బీజేపీ 51 సీట్లు, ఎన్డీఏ మిత్రపక్షాలు ఎనిమిది సీట్లు, కాంగ్రెస్ 21 ఎంపీలు గెలుచుకుంది
రెండో దశ పోలింగ్లో దాదాపు 16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 20 నుంచి 29 ఏళ్లలోపు 3.23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 42,226 మంది ఉన్నారు. ఈ విధంగా, ప్రజాస్వామ్యం గొప్ప పండుగ రెండవ దశలో, ఈ ఓటర్లు 1202 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. వీరిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ, తిరువనంతపురం నుండి కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, లోక్సభ స్పీకర్ కోటా నుంచి ఓం బిర్లా ఇవాళ జరిగే పోలింగ్లో పోటీ పడుతున్నారు.
దక్షణాది రాష్ట్రమైన కేరళలో మొత్తం 20 పార్లమెంట్ నియోజకవర్గాలకు సింగిల్ ఫేజ్లో ఎన్నికలు జరగుతున్నాయి. కర్ణాటకలో 28 సీట్లలో 14 సీట్లకు సెకండ్ విడతలో పోలింగ్ నిర్వహిస్తుండగా, రాజస్థాన్లో 25 సీట్లకు గాను 13 చోట్ల, యూపీలో 80 సీట్లలో, మధ్యప్రదేశ్లో ఆరు, అస్సాంలో ఐదు, ఛత్తీస్గడ్లో మూడు, బీహార్లో ఐదు, మహారాష్ట్రలో 8, పశ్చిమ బెంగాల్లో మూడు, త్రిపురలో రెండు, జమ్మూకశ్మీర్లో ఒక సీటుకు సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతోంది.
రెండో దశ పోలింగ్ 34.8 లక్షల మంది ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారు. 20 నుంచి 29 ఏళ్లలోపు 3.23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 1202 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో పురుషులు 1098, స్త్రీలు 102 , ట్రాన్సజెండర్కు చెందిన ఇద్దరు పోటీ పడుతున్నారు. కాగా, 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 14.78 లక్షల మంది ఉన్నారు. 42226 మంది ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారు. 14.7 లక్షల మంది ఓటర్లు వికలాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటింగ్ ఏర్పాట్లలో భాగంగా 3 హెలికాప్టర్లు, 4 ప్రత్యేక రైళ్లు, 80 వేల వాహనాలను వినియోగించారు.
ఎన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ | 13 రాష్ట్రాలు (ఒక UT) |
ఎన్ని సీట్లపై ఓటింగ్? | 88 సీట్లు |
ఓటర్ల సంఖ్య | 16 కోట్లు (8.08 పురుషులు, 7.8 స్త్రీలు, 5929 మూడవ లింగం) |
పోలింగ్ స్టేషన్ల సంఖ్య | 1.67 లక్షలు |
మోడల్ పోలింగ్ స్టేషన్ | 4195 |
వాతావరణ సూచన | జనరల్ |
సాధారణ సీట్ల సంఖ్య | 73 |
రిజర్వ్డ్ సీట్లు-ST | 6 |
రిజర్వ్డ్ సీట్లు-SC | 9 |
ఎన్నికల సంఘం విజ్ఞప్తి | వీలైనంత ఎక్కువ ఓటు వేయండి |
ఇప్పుడు అనుభవజ్ఞుల ప్రతిష్ట ప్రమాదంలో ఉన్న సీట్ల విషయానికి వస్తే, అత్యంత ప్రజాదరణ పొందిన సీటు వయనాడ్. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రెండోసారి ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి సీపీఐ నుంచి అన్నీ రాజా, బీజేపీ నుంచి కే. సురేంద్రన్ను రంగంలోకి దింపారు. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా.. రెండు పార్టీలు ఈ సీటుపై తమ పూర్తి బలాన్ని చాటుకున్నాయి. దీంతో పాటు పార్టీ కూడా అన్నీ రాజాకు మద్దతుగా తన పూర్తి బలాన్ని చాటుకుంది. ఈ సీటుపై పోటీ చాలా ఆసక్తికరంగా ఉంది.
కేరళలోని మరొక సీటు తిరువనంతపురం. ఈ స్థానంలో బీజేపీ నుంచి రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ నుంచి శశిథరూర్, సీపీఐ నుంచి పన్నియన్ రవీంద్రన్ బరిలో ఉన్నారు. దీనితో పాటు మీరట్, మధుర యూపీలోని ప్రముఖ స్థానాలలో ఉన్నాయి. మీరట్ నుంచి బీజేపీ రామాయణం సీరియల్ ‘రామ్’ అరుణ్ గోవిల్ను రంగంలోకి దించింది. ఆయనకు పోటీగా ఎస్పీకి చెందిన సునీతా వర్మ, బీఎస్పీకి చెందిన దేవవ్రత్ త్యాగి ఉన్నారు. కాగా, మధుర స్థానానికి నటుడు ధర్మేంద్ర భార్య, సిట్టింగ్ ఎంపీ హేమమాలిని పోటీలో ఉన్నారు. అదే స్థానంలో కాంగ్రెస్కు చెందిన ముఖేష్ ధంగర్, బీఎస్పీకి చెందిన సురేష్ సింగ్ పోటీ పడుతున్నారు.
బీహార్ గురించి చెప్పాలంటే అందరి చూపు పూర్నియా సీటుపైనే ఉంది. దేశంలోని హాట్ సీట్లలో ఈ సీటు ఒకటి. దీనికి కారణం స్వతంత్ర అభ్యర్థిగా పప్పు యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బీమా భారతిని ఆర్జేడీ రంగంలోకి దించింది. అయితే, ఎన్నికల్లో పోటీ చేసేందుకు యాదవ్ గతంలో లాలూ యాదవ్ను కలిశారు. ఆ తర్వాత ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. మరోవైపు కూటమిగా ఏర్పడి ఆర్జేడీ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో కోపోద్రిక్తుడైన పప్పు యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఈ సీటుపై ఆర్జేడీ, జైదు, పప్పు యాదవ్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ఈ దశలో రాజస్థాన్లో కూడా అందరి చూపు రెండు స్థానాలపైనే ఉంది. ఇందులో కోటా, ఝలావర్ ఉన్నాయి. కోటా నుంచి ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను బీజేపీ పోటీకి దింపింది. ఆయన ముందు కాంగ్రెస్కు చెందిన ప్రహ్లాద్ గుంజాల్ ఉన్నారు. కాగా, వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఝలావర్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఆయన ముందు కాంగ్రెస్ ఊర్మిళా జైన్ భాయను బరిలోకి దింపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
LIVE NEWS & UPDATES
-
పడవలో వచ్చి ఓటేసిన గ్రామీణులు
త్రిపురలోని రైమా వ్యాలీ ఓటర్లు పడవలో పోలింగ్ బూత్కు చేరుకుని ఓటు వేశారు.
Tripura | Voters of 44/68 Raima Valley Assembly segment, in a remote area of the Dhalai district, use boats to arrive at their polling booth to exercise their franchise
(Source: Election Commission of India) pic.twitter.com/nKEDaA1F7W
— ANI (@ANI) April 26, 2024
-
ఓటు వేసిన డీకే శివకుమార్
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కనకపుర పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కాంగ్రెస్ టికెట్పై బెంగళూరు రూరల్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
#LokSabhaElections2024 | Karnataka Deputy CM & Congress leader DK Shivakumar casts his vote in Kanakapura
His brother & Congress leader DK Suresh is contesting from Bangalore Rural constituency. pic.twitter.com/uZkRz0PkNf
— ANI (@ANI) April 26, 2024
-
-
అంబులెన్స్లో వచ్చి ఓటు వేసిన మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత
మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జాల్నా జిల్లా అంబాద్ తాలూకాలోని పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేశారు. గత కొన్ని రోజులుగా జరంగే అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్నారు. కానీ అంబులెన్స్లో వచ్చి తన ఓటును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఓటు వేయాల్సిన బాధ్యత సమాజం భుజాలపై ఉంది, మరాఠా రిజర్వేషన్కు అనుకూలంగా ఉన్నవారికి మద్దతు ఇవ్వాలి." అంటూ పిలుపునిచ్చారు.
-
క్యూలో నిల్చుని ఓటు వేసిన ఇస్రో చీఫ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ కేరళలోని తిరువనంతపురంలోని పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతర ఓటర్లతో పాటు క్యూలో నిల్చుని తన ఓటు వేశారు. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రాజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు సోమనాథ్.
#WATCH | ISRO chief S Somanath queues up along with other votes at a polling station in Thiruvananthapuram in Kerala #LokSabhaElections2024 pic.twitter.com/AbHmBnKXVd
— ANI (@ANI) April 26, 2024
#WATCH | I am very happy to vote today. Each vote counts. Don't hesitate to come out to vote," says ISRO chief S Somanath in Kerala's Thiruvananthapuram. pic.twitter.com/UCTKhTB3nM
— ANI (@ANI) April 26, 2024
-
ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ
కర్ణాటకలో లోక్సభ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ ప్రధాన మంత్రి హెచ్డీ దేవెగౌడ హాసన్లోని పోలింగ్ బూతులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
#WATCH | Karnataka: Former PM and JD(S) president HD Deve Gowda casts his vote at a polling booth in Hassan. #LokSabhaElections2024 pic.twitter.com/JGjA9CcCPI
— ANI (@ANI) April 26, 2024
-
-
ఓటు వేసిన వారికి ఉచిత టిఫిన్ ఆఫర్
ఓటు వేసిన వారికి ఉచిత టిఫిన్ ఆఫర్ ప్రకటించారు బెంగళూరులోని ఒక హోటల్ నిర్వహకులు. దీంతో నృపతుంగ రోడ్డులోని నిసర్గ గ్రాండ్ హోటల్ ముందు పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. ఓటు వేసినట్లు తమ వేలిపై ఇంక్ గుర్తును చూపించిన వారికి వెన్న దోసె, నెయ్యి లడ్డు, జ్యూస్ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది ఈ హోటల్ యాజమాన్యం.
Long queues were seen at Nisarga Grand Hotel on Nrupathunga Road in Bengaluru, which is offering free benne khali dosa, ghee laddu, and juice on April 26 to voters who display their inked fingers as proof of voting. https://t.co/l7uewY0Odo pic.twitter.com/XpeNwaAONk
— ChristinMathewPhilip (@ChristinMP_) April 26, 2024
(Source:@ChristinMathewPhilip)
)
-
భర్తతో కలిసి ఓటు హక్కు వేసిన నవనీత్ కౌర్ రాణా
అమరావతిలో తన భర్త రవి రాణాతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న సినీ నటి, అమరావతి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రాణా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మహిళల బంగారాన్ని దోచుకోవడానికి కాంగ్రెస్ను ఎప్పటికీ అనుమతించరు’ అని నవనీత్ రాణా అన్నారు.
#WATCH | Maharashtra: BJP candidate from Amravati Navnit Rana along with her husband Ravi Rana cast their vote in Lok Sabha polls, at a polling booth in Amravati. #LokSabhaElections2024 pic.twitter.com/dJJygDRA8E
— ANI (@ANI) April 26, 2024
-
ఉదయం 11గం.లకు త్రిపుర-ఛత్తీస్గఢ్లో అత్యధిక పోలింగ్
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం ఉదయం 11 గంటల వరకు త్రిపురలో అత్యధికంగా 36.42% ఓటింగ్ నమోదైంది. అదే సమయంలో, ఛత్తీస్గఢ్లో 35.47%, మణిపూర్లో 33.22%, పశ్చిమ బెంగాల్లో 31.25%, మధ్యప్రదేశ్లో 28.15%, అస్సాంలో 27.43%, రాజస్థాన్లో 26.84%, జమ్మూ కాశ్మీర్లో 26.6%, కేరళలో 25.6%, యూపీలో 24.31%, బీహార్లో 21.68%, కర్ణాటకలో 22.34% ఓటింగ్ నమోదైంది.
-
ఓటింగ్ సరళిని పరశీలించిన భూపేష్ బఘేల్
ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి భూపేష్ బఘేల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ బూత్లను సందర్శించారు. ఓటర్లతో కూడా సంభాషించారు. ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు. కాగా, ఛత్తీస్గఢ్లో రాజ్నంద్గావ్, మహాసముంద్, కాంకేర్ లోక్సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది.
#WATCH | Congress candidate from Chhattisgarh's Rajnandgaon, Bhupesh Baghel visits different polling booths in the parliamentary constituency and also interacts with voters.
Rajnandgaon, Mahasamund and Kanker are voting in the second phase of Lok Sabha elections in Chhattisgarh. pic.twitter.com/wtmZNzRYZH
— ANI (@ANI) April 26, 2024
-
ఓటు వేసి ప్రజాస్వామ్య ప్రక్రియకు సహకరించండిః అశోక్ చవాన్
బిజెపి నాయకుడు అశోక్ చవాన్ మహారాష్ట్రలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం అశోక్ చవాన్ మాట్లాడుతూ, "ప్రజలకు పెద్ద సంఖ్యలో వెళ్లి ఓటు వేయాలని నా విజ్ఞప్తి. ప్రజాస్వామ్య ప్రక్రియకు సహకరించండి. బలమైన ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మీ ఓటు ముఖ్యం.. అన్ని అపార్థాలు తొలగిపోతాయి. అలాగే మరాఠాలకు 10% రిజర్వేషన్లు లభించాయనడంలో సందేహం లేదు." అని అన్నారు.
#WATCH | Nanded, Maharashtra: After casting his vote, BJP leader Ashok Chavan says, "My appeal to the people is to go and vote in large numbers. Contribute to the democratic process and vote because your vote is important in bringing a strong government... All the… pic.twitter.com/T5Jq3Ae9pu
— ANI (@ANI) April 26, 2024
-
ఓటు వేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చామరాజనగర్లోని పోలింగ్ బూత్కు వచ్చిన ఆయన ఓటు వేశారు.
#WATCH चामराजनगर: कर्नाटक के मुख्यमंत्री सिद्धारमैया ने मतदान किया। pic.twitter.com/WkboGG4bOk
— ANI_HindiNews (@AHindinews) April 26, 2024
-
జమ్మూకశ్మీర్లోని అఖ్నూర్లో ఓటింగ్ ప్రశాంతం
జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో ఉన్న అఖ్నూర్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారీగా తరలి వస్తున్న ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ సందర్భంగా ఎలాంతి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు.
#WATCH अखनूर, जम्मू-कश्मीर: नियंत्रण रेखा (LOC) के पास स्थित अखनूर में लोगों ने मतदान किया। pic.twitter.com/AlW2qp9Dly
— ANI_HindiNews (@AHindinews) April 26, 2024
-
ఓటు వేసిన కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్
కేరళలోని అలప్పుజా లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశ పోలింగ్ తర్వాత, ప్రధానమంత్రి భయాందోళనలకు గురవుతున్నారన్నారు.
"After phase one, PM is panicking": Congress' KC Venugopal after casting vote in Alappuzha
Read @ANI Story | https://t.co/F7o6qzThA0#KCVenugopal #AlappuzhaConstituency #Congress #LokSabhaElections2024 pic.twitter.com/Nvsl0SKSiZ
— ANI Digital (@ani_digital) April 26, 2024
-
ఓటింగ్కు ముందు తేజస్వి సూర్య ప్రత్యేక పూజలు
లోక్సభ ఎన్నికలకు ఓటు వేయడానికి ముందు బెంగళూరు సౌత్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. బెంగళూరు సౌత్ నియోజక వర్గంలో తేజస్వి సూర్యపై సౌమ్యారెడ్డిని కాంగ్రెస్ పోటీకి దింపింది.
#WATCH | Karnataka: BJP candidate from Bengaluru South constituency Tejasvi Surya offers prayers at his residence ahead of casting his vote for the Lok Sabha polls.
Congress has fielded Sowmya Reddy opposite Tejasvi Surya in the Bengaluru South constituency.
Karnataka is voting… pic.twitter.com/QYukivlRWQ
— ANI (@ANI) April 26, 2024
-
ఓటు వేసిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే
కర్ణాటకలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజే బెంగళూరులోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
#WATCH | Karnataka: Union Minister & BJP leader Shobha Karandlaje casts her vote at a polling booth in Bengaluru. #LokSabhaElections2024 pic.twitter.com/8afFvyrazk
— ANI (@ANI) April 26, 2024
-
బెంగళూరులో ఓటు వేసిన నిర్మలా సీతారామన్
లోక్సభ రెండో దశ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్రంలో మరోసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
#WATCH बेंगलुरु: केंद्रीय मंत्री निर्मला सीतारमण ने कहा, "...मैं चाहती हूं कि ज्यादा से ज्यादा लोग आकर मतदान करें...मुझे लगता है कि यह स्पष्ट है कि लोग एक स्थिर सरकार चाहते हैं, वे अच्छी नीतियां, प्रगति और विकास चाहते हैं और इसी के लिए वे बाहर आ रहे हैं। वे पीएम मोदी को अपना… https://t.co/3gPakzdUEv pic.twitter.com/XBni73B3n8
— ANI_HindiNews (@AHindinews) April 26, 2024
-
అందరూ బయటకు వచ్చి ఓటు వేయండిః రాహుల్ ద్రావిడ్
కర్ణాటకలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారీగా తరలివచ్చిన ఓటర్లు పోలింగ్ బూత్ల వెలుపల వరుసలో ఉన్నారు. క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ ఓటర్లకు ఒక సందేశాన్ని అందించారు. బెంగుళూరులో తన ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. "అందరూ బయటకు వచ్చి ఓటు వేయండి. ఇది ప్రజాస్వామ్యంలో మనకు లభించే అవకాశం" అని చెప్పారు.
#LokSabhaElections2024 | Rahul Dravid casts his vote in Karnataka's Bengaluru and says, "Everyone must come out and vote. It is an opportunity we get in a democracy." pic.twitter.com/VHPOMinNpb
— ANI (@ANI) April 26, 2024
-
బాగ్పత్లో గంటపాటు నిలిచిపోయిన పోలింగ్
ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ లోక్సభలోని ఖేక్రాలోని జైన్ ఇంటర్ కాలేజీ, బూత్ నంబర్ 222లో ఈవీఎం మెషిన్ మొరాయించింది. మొదటి గంట పాటు ఇక్కడ ఈవీఎం మెషిన్ పనిచేయడం లేదని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. దీంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా ఎన్నికల సంఘం ఈ విషయాన్ని గుర్తించాలని ఎస్పీ డిమాండ్ చేసింది.
-
యూపీలోని అమ్రోహాలో ఎన్నికల బహిష్కరణ
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలోని హసన్పూర్ అసెంబ్లీకి చెందిన జుండి మాఫీ గ్రామంలోని కాంపోజిట్ స్కూల్ బూత్లో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. అదే సమయంలో, బాగ్పత్లోని ఛప్రౌలీ అసెంబ్లీ ఖప్రానా గ్రామంలోని బూత్ నంబర్ 262 వద్ద ఈవీఎం యంత్రం మొరాయించింది. దీంతో అరగంట పాటు ఓటింగ్కు అంతరాయం ఏర్పడింది.
-
ఎంపీ: సాత్నాలో మొరాయించిన ఈవీఎం
మధ్యప్రదేశ్లోని సాత్నా లోక్సభ ఎన్నికల్లో MCP తర్వాత ఓటింగ్ జరుగుతోంది. నాగౌడ్లోని 99వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం యంత్రం చెడిపోయింది. చిత్రకూట్ పోలింగ్ బూత్ నంబర్ 73లోని ఈవీఎం పగిలిపోవడంతో దాన్ని మార్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
-
రాజస్థాన్ ఓటర్లలో అత్యుత్సాహం
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న లోక్సభ రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరుతున్నారు. ఈక్రమంలోనే రాజస్థాన్లో ఓటింగ్పై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. చాలా చోట్ల పొడవైన లైన్లు కనిపిస్తున్నాయి.
#GeneralElections2024 #Phase2 in #Rajasthan: A canvas of democracy painted with the vibrant hues of voter zeal
Credit : CEO Rajasthan#YouAreTheOne #ChunavKaParv #DeshKaGarv pic.twitter.com/nFD1Bv1P49
— Election Commission of India (@ECISVEEP) April 26, 2024
-
దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుః రాహుల్ గాంధీ
రెండో దశ పోలింగ్ సందర్భంగా రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. "నా ప్రియమైన దేశ ప్రజలారా! దేశ భవితవ్యాన్ని నిర్ణయించబోతున్న ఈ చారిత్రాత్మక ఎన్నికల రెండో దశ నేడు. తదుపరి ప్రభుత్వం 'కొంతమంది బిలియనీర్ల'దా లేక '140 కోట్ల భారతీయుల'దా అనేది మీ ఓటు నిర్ణయిస్తుంది. అందుకే ఈరోజు ఇంటి నుంచి బయటకు వచ్చి 'రాజ్యాంగ సైనికుడు'గా మారి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఓటు వేయడం ప్రతి పౌరుడి కర్తవ్యం." అంటూ పేర్కొన్నారు.
मेरे प्यारे देशवासियों!
देश की तकदीर का फैसला करने जा रहे इस ऐतिहासिक चुनाव का आज दूसरा चरण है।
आपका वोट तय करेगा कि अगली सरकार ‘चंद अरबपतियों’ की होगी या ‘140 करोड़ हिंदुस्तानियों’ की।
इसलिए हर नागरिक का कर्तव्य है कि वह आज घर से बाहर निकले और ‘संविधान का सिपाही’ बन कर…
— Rahul Gandhi (@RahulGandhi) April 26, 2024
-
ఓటు వేసిన నటుడు ప్రకాష్ రాజ్
నటుడు ప్రకాష్ రాజ్ రెండో విడతలో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాకు నమ్మకం ఉన్న అభ్యర్థికే నా ఓటు, పార్టీల మేనిఫెస్టోలోని అంశాలకు సంబంధించి రెండోది. ద్వేషానికి, దేశాన్ని విభజించే వ్యక్తులకు వ్యతిరేకంగా ఓటు వేశాను. మంచి ప్రతినిధికి ఓటు వేశాను అంటూ పేర్కొన్నారు.
#WATCH | Karnataka: Actor Prakash Raj casts his vote at a polling station in Bengaluru.
Karnataka is voting on 14 seats today in the second phase of Lok Sabha elections.#LokSabhaElections2024 pic.twitter.com/AzghrtGPPS
— ANI (@ANI) April 26, 2024
-
పెళ్లి రోజున ఓటు వేసిన వరుడు
రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఓపెళ్లికొడుకు బ్యాండ్ బాజా, బారాత్ తో ఓటు వేయడానికి వచ్చారు. పెళ్లి కొడుకుతో పాటు పెళ్లిబృందం కూడా అమరావతిలోని పోలింగ్ బూత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వరుడు ఓటు ప్రాముఖ్యతను వివరించారు. పెళ్లికి ముందు అభివృద్ధికి ఓటేశానని చెప్పారు.
#WATCH महाराष्ट्र: शादी के दिन एक दूल्हा अमरावती स्थित मतदान केंद्र पर मतदान करने पहुंचा। pic.twitter.com/gKc7rCFXkK
— ANI_HindiNews (@AHindinews) April 26, 2024
-
ఝలావర్లో ఓటు హక్కు వినియోగించుకున్న వసుంధర రాజే
రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే ఝలావర్ లోక్సభ స్థానంలో పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం అభివృద్ధిని కోరుకుంటోందని, అందుకే ఈ ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడి మూడోసారి మోదీయే ప్రధాని అవుతారని అన్నారు. రాజస్థాన్ ప్రజలు బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తారని, చారిత్రాత్మక విజయాన్ని అందిస్తార వసుంధర రాజే ధీమా వ్యక్తం చేశారు.
#WATCH झालावाड़: राजस्थान की पूर्व मुख्यमंत्री व भाजपा नेता वसुंधरा राजे ने कहा, "देश विकास चाहता है इसलिए इस चुनाव के बाद फिर से भाजपा की सरकार बनेगी और तीसरी बार मोदी जी प्रधानमंत्री बनेंगे... ये भी विश्वास है कि राजस्थान में जनता भाजपा को पूरा समर्थन देगी और भाजपा को ऐतिहासिक… https://t.co/Xjq7dJlS0p pic.twitter.com/jU1efoIeWA
— ANI_HindiNews (@AHindinews) April 26, 2024
-
ఓటు వేయాలని సుధా మూర్తి విజ్ఞప్తి
రెండవ దశ పోలింగ్ జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని రాజ్యసభ సభ్యులు సుధా మూర్తి విజ్ఞప్తి చేశారు. 'ఇంట్లో కూర్చుని వ్యాఖ్యానించవద్దని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. దయచేసి బయటకు వచ్చి మీ నాయకుడిని ఎన్నుకోండి. దయచేసి వచ్చి ఓటు వేయండి' అంటూ సుధామూర్తి పిలుపునిచ్చారు.
#WATCH बेंगलुरु: लेखिका व राज्यसभा सांसद सुधा मूर्ति ने कहा, "मैं सभी से कहना चाहती हूं कि घर पर बैठकर टिप्पणी न करें। कृपया बाहर आएं और अपना नेता चुनें... कृपया आएं और मतदान करें..." #LokSabhaElections2024 pic.twitter.com/DgwVF89CYV
— ANI_HindiNews (@AHindinews) April 26, 2024
-
ఓటు వేసిన కేంద్ర మంత్రి మురళీధరన్
కేంద్ర మంత్రి, అట్టింగల్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వి మురళీధరన్ ఓటు వేశారు. కేరళలోని అట్టింగల్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్కు తరలివచ్చిన ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
#WATCH | Union Minister & BJP candidate from the Attingal Lok Sabha constituency, V Muraleedharan cast his vote in the Lok Sabha polls.#LokSabhaElections2024 pic.twitter.com/9RP1Vm5AST
— ANI (@ANI) April 26, 2024
-
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ ఎన్నికలుః అశోక్ గెహ్లాట్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ ఎన్నికలు జరగుతున్నాయన్నారు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్. నేడు దేశంలో అత్యంత ముఖ్యమైన సమస్య నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధనిక, పేదల మధ్య అంతరం పెరుగుతుందని భావిస్తున్నాను." అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
#WATCH | Jodhpur: Former Rajasthan CM & Congress leader Ashok Gehlot says, "The first phase of the election (held on April 19) gave a clear message about what the public wants...The Prime Minister is interpreting something that has not been put in the manifesto (of… pic.twitter.com/cx5qBhnRC9
— ANI (@ANI) April 25, 2024
-
ఓటింగ్ బూత్లో అన్ని ఏర్పాట్లుః రాజీవ్ కుమార్
రెండో దశ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. “గత రెండు సంవత్సరాలుగా సన్నాహాలు చేస్తున్నాం, అన్ని బూత్లలో ఏర్పాట్లు ఉన్నాయి, ఓటర్లకు తాగునీరు, ఫ్యాన్లతో సహా అన్ని ఏర్పాట్లు చేశాం. ఓటర్లు తమ ఇంటి నుండి బయటకు రావాలని ప్రోత్సహిస్తున్నాం. ఇళ్లు, విడిచి ఓటు వేయండి." ఎక్కడి హింసకు చోటు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు.
-
88 స్థానాలకు బరిలో 1202 మంది అభ్యర్థులు
రెండో దశ లోక్సభ ఎన్నికల్లో 88 స్థానాలకు గానూ 1202 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 102 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1098, ట్రాన్సజెండర్కు చెందిన ఇద్దరు పోటీ పడుతున్నారు. కాగా, 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 14.78 లక్షల మంది ఉన్నారు. ఈ దశలో 15.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8.08 కోట్ల మంది పురుషులు కాగా, 7.80 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రెండో దశలో 1.67 లక్షల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.
-
దేశ బంగారు భవిష్యత్తును సృష్టించడంలో మీ ప్రతి ఓటు నిర్ణయాత్మకంః యోగి
రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ట్వీట్టర్ ఎక్స్ వేదికగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు త్వరగా ఓటు వేయాలని కోరారు. 'సురక్షితమైన, అభివృద్ధి చెందిన భారతదేశం' కోసం ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నామని సీఎం యోగి అన్నారు. దేశానికి బంగారు భవిష్యత్తును సృష్టించడంలో మీ ప్రతి ఓటు నిర్ణయాత్మకం అని పేర్కొన్నారు.
लोक सभा चुनाव-2024 के आज दूसरे चरण के मतदान में सम्मानित मतदाताओं से अपील है कि 'सुरक्षित व विकसित भारत' के लिए मतदान अवश्य करें।
आपका एक-एक वोट देश का स्वर्णिम भविष्य बनाने में निर्णायक है।
पहले मतदान, फिर जलपान!
— Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) April 25, 2024
-
రెండవ దశ పోలింగ్ ప్రారంభం
13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్ జరిగాల్సి ఉంది. అయితే మధ్యప్రదేశ్లోని బేతుల్ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలవి మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దీంతో రెండో దశ 88 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
-
నేటి పోలింగ్ హైలైట్స్ ఇవే!
- 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 స్థానాలకు ఓటింగ్.
- రెండో దశలో 15 కోట్ల 88 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
- రెండో దశలో కేరళలో గరిష్టంగా 20 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది.
- రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ స్థానంలో ఇవాళే ఓటింగ్.
- ఇవాళ తేలనున్న మోదీ ప్రభుత్వంలోని 6 మంది మంత్రులతో సహా ఇద్దరు మాజీ సీఎంల భవితవ్యం.
- లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పోటీ చేస్తున్న కోటా నియోజకవర్గంలోనూ ఈరోజు ఓటింగ్ జరగనుంది.
- హేమామాలిని, శశిథరూర్, పప్పు యాదవ్ వంటి వారు ఈ దశలో పోటీలో ఉన్నారు.
- కాంగ్రెస్కు చెందిన వెంకటరమణ గౌడ మండ్య నుంచి అత్యంత ధనవంతుడు.
- నేటితో 4 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.
- మొదటి 2 దశలను కలుపుకుని 14 రాష్ట్రాలు పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ పూర్తవుతుంది.
-
ప్రతి ఓటు, ప్రతి గొంతు ముఖ్యమైనదేః ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 88 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓటర్లకు కీలక సందేశాన్నిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని ప్రజలను కోరారు. యువత, తొలిసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు, ప్రతి గొంతు ముఖ్యమైనదేనని వ్యాఖ్యానించారు. ఎంత ఎక్కువ ఓటు వేస్తే మన ప్రజాస్వామ్యం అంత బలపడుతుందన్నారు. మన యువ ఓటర్లతో పాటు దేశంలోని మహిళా శక్తి వారు తమ ఓటు వేయడానికి ఉత్సాహంగా ముందుకు రావాలన్నారు. ఈ మేరకు రెండో దశ పోలింగ్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు ఇంగ్లిష్, హిందీ, మళయాళి, మరాఠీ, కన్నడ సహా పలు భాషల్లో ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు.
लोकसभा चुनाव में आज दूसरे चरण की सभी सीटों के मतदाताओं से मेरा विनम्र अनुरोध है कि वे रिकॉर्ड संख्या में मतदान करें। जितना अधिक मतदान होगा, उतना ही मजबूत हमारा लोकतंत्र होगा। अपने युवा वोटर्स के साथ ही देश की नारीशक्ति से मेरा यह विशेष आग्रह है कि वोट डालने के लिए वे बढ़-चढ़कर…
— Narendra Modi (@narendramodi) April 26, 2024
Published On - Apr 26,2024 7:25 AM