సూర్యని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారుః భారతీరాజా
తమిళ సినీ పరిశ్రమలో నటుడు సూర్య తీసిన సినిమా చుట్టు జరుగుతున్న వివాదంపై ఘాటుగా స్పందించారు ప్రముఖ దర్శకుడు భారతి రాజా. సూర్యని కొంతమంది కావాలనే టార్గెట్ చెస్తున్నారు. దీని వెనుక రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉంది. థియేటర్స్లో సాధారణ జనం సినిమా..
తమిళ సినీ పరిశ్రమలో నటుడు సూర్య తీసిన సినిమా చుట్టు జరుగుతున్న వివాదంపై ఘాటుగా స్పందించారు ప్రముఖ దర్శకుడు భారతి రాజా. సూర్యని కొంతమంది కావాలనే టార్గెట్ చెస్తున్నారు. దీని వెనుక రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉంది. థియేటర్స్లో సాధారణ జనం సినిమా చూడాలంటే టికెట్ దగ్గర నుండి పాప్కార్న్ వరకు భారీగా దోపిడీ చేసినప్పుడు ఒకరు ప్రశ్నించ లేదు. పెద్ద హీరోల సినిమాల కోసం చిన్న బడ్జెట్లో నిర్మించిన సినిమాల విడుదలకు.. థియేటర్స్ని ఇవ్వనప్పుడు ఒక్కరు నోరు మెదపలేదు.
ఇప్పుడు సూర్య ఓటీటీలో సినిమా విడుదల చేస్తున్నాడని అందరూ థియేటర్స్ యాజమాన్యాలు నష్టపోతాయని ముసలి కన్నీరు కారుస్తున్నారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్కి ఎప్పుడు అనుమతి ఇస్తారో తేలినప్పుడు ఒక నిర్మాతగా నటుడు సూర్య నిర్ణయం నేను స్వాగతిస్తున్నాను. ఇది సినీ పరిశ్రమకి సంబంధించిన సమస్య. దీనిని ఒక వ్యక్తి సమస్యగా చిత్రీకరించి నటుడు సూర్య కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇకపై నటుడు సూర్యపై ఎవరు ఎటువంటి కామెంట్స్ చేస్తే ఉరుకోము. పరిశ్రమలో సమస్యలు ఉంటే అందరం మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకుందామని పేర్కొన్నారు డైరెక్టర్ భారతీ రాజా.
Read More:
డీప్ కోమాలోనే ప్రణబ్ ముఖర్జీః ఆర్మీ ఆస్పత్రి వైద్యులు
బ్రేకింగ్ః తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్