AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిమ్ క్రూరత్వానికి నిదర్శనం.. పారిపోవాలని చూసిన వాళ్లకు ఉరితీత..

ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జనమెరిగిన సత్యం. ఆయన వేసే శిక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో చంపించాడని అప్పట్లో అనేక వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మరోసారి కిమ్ క్రూరత్వం బయటపడింది. కొడుకుని తన తండ్రి దగ్గడకు చేర్చాలని చూసిన ఓ జంటను నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలు చేసి చంపేశాడు ఈ నార్త్ కొరియా […]

కిమ్ క్రూరత్వానికి నిదర్శనం.. పారిపోవాలని చూసిన వాళ్లకు ఉరితీత..
Ravi Kiran
|

Updated on: May 27, 2020 | 1:34 PM

Share

ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జనమెరిగిన సత్యం. ఆయన వేసే శిక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో చంపించాడని అప్పట్లో అనేక వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మరోసారి కిమ్ క్రూరత్వం బయటపడింది. కొడుకుని తన తండ్రి దగ్గడకు చేర్చాలని చూసిన ఓ జంటను నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలు చేసి చంపేశాడు ఈ నార్త్ కొరియా డిక్టేటర్.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కొరియాలోని ర్యాంగాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 50 ఏళ్ల భార్యాభర్తలు ఇటీవల దేశ సరిహద్దులు దాటి చైనా పారిపోవాలని అనుకున్నారు. తన సోదరుడి కొడుకు(14)ను అతడి కుటుంబంతో చేర్చాలనే ఉద్దేశ్యంతో వారు నార్త్ కొరియా సరిహద్దులు దాటి చైనాలోకి ప్రవేశించి.. ఆ తర్వాత దక్షిణ కొరియా వెళ్ళాలనుకున్నారు. కొద్దికాలం క్రితం ఆమె సోదరుడు నార్త్ కొరియా నుంచి పారిపోయి సౌత్ కొరియాలో స్థిరపడ్డాడు. అయితే అతని కొడుకు మాత్రం వీరి దగ్గరే ఉండిపోయాడు. ఇటీవల కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలన్నీ పూర్తిగా దెబ్బతినడంతో నార్త్ కొరియా నుంచి వెళ్ళిపోవాలని ఆ జంట నిర్ణయించుకున్నారు.

అనుకున్నట్లుగానే అంతా సిద్దం చేసుకుని మేనల్లుడితో పాటు రహస్యంగా ర్యాంగాంగ్‌లోని చైనా సరిహద్దుకు చేరుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న బోర్డు సెక్యూరిటీ వాళ్లకు పట్టుబడ్డారు. అంతే ఇంకేముంది సైన్యం ఆ జంటను చిత్రహింసలకు గురి చేసి నిజం ఒప్పుకునేలా చేశారు. తమ మేనల్లుడిని తన తండ్రి దగ్గరకు చేర్చలనుకున్నామని.. అంతకు మించి మేము ఏ తప్పు చేయలేదని వారు ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయింది. కిమ్ సిఫార్సుతో ఆ ఇద్దరినీ ఫైరింగ్ స్క్వాడ్ ఉరి తీసి చంపేశారు. బాలుడు మైనర్ కావడంతో అతడిని లేబర్ క్యాంపుకు తరలించారు. ఇక ఈ విషయం బయటికి రావడంతో నార్త్ కొరియా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం నార్త్ కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ దేశంలో ఇలా సైన్యం చేతుల్లో హతమైన వారు ఇప్పటికే చాలామంది ఉన్న విషయం విదితమే.

Follow Us
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు