AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిమ్ క్రూరత్వానికి నిదర్శనం.. పారిపోవాలని చూసిన వాళ్లకు ఉరితీత..

ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జనమెరిగిన సత్యం. ఆయన వేసే శిక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో చంపించాడని అప్పట్లో అనేక వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మరోసారి కిమ్ క్రూరత్వం బయటపడింది. కొడుకుని తన తండ్రి దగ్గడకు చేర్చాలని చూసిన ఓ జంటను నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలు చేసి చంపేశాడు ఈ నార్త్ కొరియా […]

కిమ్ క్రూరత్వానికి నిదర్శనం.. పారిపోవాలని చూసిన వాళ్లకు ఉరితీత..
Ravi Kiran
|

Updated on: May 27, 2020 | 1:34 PM

Share

ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జనమెరిగిన సత్యం. ఆయన వేసే శిక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో చంపించాడని అప్పట్లో అనేక వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మరోసారి కిమ్ క్రూరత్వం బయటపడింది. కొడుకుని తన తండ్రి దగ్గడకు చేర్చాలని చూసిన ఓ జంటను నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలు చేసి చంపేశాడు ఈ నార్త్ కొరియా డిక్టేటర్.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కొరియాలోని ర్యాంగాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 50 ఏళ్ల భార్యాభర్తలు ఇటీవల దేశ సరిహద్దులు దాటి చైనా పారిపోవాలని అనుకున్నారు. తన సోదరుడి కొడుకు(14)ను అతడి కుటుంబంతో చేర్చాలనే ఉద్దేశ్యంతో వారు నార్త్ కొరియా సరిహద్దులు దాటి చైనాలోకి ప్రవేశించి.. ఆ తర్వాత దక్షిణ కొరియా వెళ్ళాలనుకున్నారు. కొద్దికాలం క్రితం ఆమె సోదరుడు నార్త్ కొరియా నుంచి పారిపోయి సౌత్ కొరియాలో స్థిరపడ్డాడు. అయితే అతని కొడుకు మాత్రం వీరి దగ్గరే ఉండిపోయాడు. ఇటీవల కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలన్నీ పూర్తిగా దెబ్బతినడంతో నార్త్ కొరియా నుంచి వెళ్ళిపోవాలని ఆ జంట నిర్ణయించుకున్నారు.

అనుకున్నట్లుగానే అంతా సిద్దం చేసుకుని మేనల్లుడితో పాటు రహస్యంగా ర్యాంగాంగ్‌లోని చైనా సరిహద్దుకు చేరుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న బోర్డు సెక్యూరిటీ వాళ్లకు పట్టుబడ్డారు. అంతే ఇంకేముంది సైన్యం ఆ జంటను చిత్రహింసలకు గురి చేసి నిజం ఒప్పుకునేలా చేశారు. తమ మేనల్లుడిని తన తండ్రి దగ్గరకు చేర్చలనుకున్నామని.. అంతకు మించి మేము ఏ తప్పు చేయలేదని వారు ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయింది. కిమ్ సిఫార్సుతో ఆ ఇద్దరినీ ఫైరింగ్ స్క్వాడ్ ఉరి తీసి చంపేశారు. బాలుడు మైనర్ కావడంతో అతడిని లేబర్ క్యాంపుకు తరలించారు. ఇక ఈ విషయం బయటికి రావడంతో నార్త్ కొరియా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం నార్త్ కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ దేశంలో ఇలా సైన్యం చేతుల్లో హతమైన వారు ఇప్పటికే చాలామంది ఉన్న విషయం విదితమే.

Follow Us