సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్న కీర్తి సురేష్?
మహానటి సినిమాతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది సినీనటి కీర్తిసురేష్. అలనాటి తార సావిత్రి బయోపిక్తో అందరిని ఆకర్షించింది కీర్తి సురేష్. అనంతరం వరుస పెట్టి అవకాశాలను దక్కించుకుంటూ కీర్తి ముందుకు దూసుకుపోతుంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసుకుంటూ అందరినీ అలరిస్తోన్న ఈ బ్యూటీ..
మహానటి సినిమాతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది సినీనటి కీర్తిసురేష్. అలనాటి తార సావిత్రి బయోపిక్తో అందరిని ఆకర్షించింది కీర్తి సురేష్. అనంతరం వరుస పెట్టి అవకాశాలను దక్కించుకుంటూ కీర్తి ముందుకు దూసుకుపోతుంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసుకుంటూ అందరినీ అలరిస్తోన్న ఈ బ్యూటీ ఇటీవలే పెంగ్విన్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్తో కలిసి ‘అన్నాట్టే’, ఇక తెలుగు సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్గా నటించనుంది. మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టింది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ తన ఫాలోవర్లు, అభిమానులు సర్ప్రైజ్ కానుకను ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే కీర్తి సురేష్ నిర్మాతగా మారనుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తమిళ్లో ఓ వెబ్ సిరీస్ నిర్మించేందుకు కీర్తి సురేష్ ప్లాన్ చేస్తోందట. ఒకవేళ ఇదే నిజమైతే కీర్తి సురేష్ ఎలాంటి స్టోరీతో అభిమానులను అలరిస్తుందో చూడాలి.
Read More:
ఏపీలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 10 వేల కేసులు నమోదు
ఆసియాలో ఫస్ట్ టైం: కోవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి
ఇంకా డీప్ కోమాలోనే ప్రణబ్.. వెంటిలేటర్ మీద చికిత్స