కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు

మే 28వ తేదీన టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతీ ఏడాది.. కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద ఆయనకు నివాళులర్పిస్తున్న..

కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు
Follow us

| Edited By:

Updated on: May 27, 2020 | 2:57 PM

మే 28వ తేదీన టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతీ ఏడాది.. కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద ఆయనకు నివాళులర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్ల కూడదని.. నందమూరి తారక రామారావు మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు అధికారికంగా ప్రకటించారు. పెద్ద ఎత్తున జనాలకు అక్కడికి చేరుకుంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్న కారణంగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఇంట్లోనే ఉండి ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తామని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు పేర్కొన్నారు.

Read More:

ఏపీ వాహనదారులకు గుడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి లైసెన్స్ సర్వీసులు ప్రారంభం

రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..

ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి..