ఏపీ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్స్… కరోనా టెస్ట్లు చేయించుకున్న వారికి మాత్రమే
ఏపీలో కరోనా జడలు విప్పుకుంటోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల సాయంతో ...
ఏపీలో కరోనా జడలు విప్పుకుంటోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల సాయంతో ఇంటిటి సర్వే నిర్వహిస్తూ.. వైరస్ అనుమానితులను గుర్తించేలా చర్యలు చేపట్టింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. వివరాల్లోకి వెళితే…
కరోనా వైరస్ (కోవిడ్–19) వ్యాప్తిని అరికట్టేందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి కొత్త ఆలోచన చేశారు. పొడి దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకుంటే ఆకర్షణీయమైన గిఫ్ట్తో పాటు నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ఈ లక్షణాలున్నవారు స్థానికంగా ఉండే వైద్య సిబ్బందికి సమాచారం ఇస్తే అధికారులే ఇంటి వద్దకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే వారి పేరు గోప్యంగా ఉంచి మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ మురళీధర్రెడ్డి తెలిపారు.