AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ స‌ర్కార్ అదిరిపోయే గిఫ్ట్స్‌… క‌రోనా టెస్ట్‌లు చేయించుకున్న వారికి మాత్ర‌మే

ఏపీలో క‌రోనా జ‌డ‌లు విప్పుకుంటోంది. వైరస్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా వాలంటీర్ల సాయంతో ...

ఏపీ స‌ర్కార్ అదిరిపోయే గిఫ్ట్స్‌... క‌రోనా టెస్ట్‌లు చేయించుకున్న వారికి మాత్ర‌మే
Jyothi Gadda
|

Updated on: Apr 12, 2020 | 1:04 PM

Share

ఏపీలో క‌రోనా జ‌డ‌లు విప్పుకుంటోంది.  వైరస్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా వాలంటీర్ల సాయంతో ఇంటిటి స‌ర్వే నిర్వ‌హిస్తూ.. వైర‌స్ అనుమానితుల‌ను గుర్తించేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ ఓ వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. వివ‌రాల్లోకి వెళితే…

కరోనా వైరస్ (కోవిడ్‌–19) వ్యాప్తిని అరికట్టేందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి కొత్త ఆలోచ‌న చేశారు. పొడి దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకుంటే ఆకర్షణీయమైన గిఫ్ట్‌తో పాటు నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ఈ లక్షణాలున్నవారు స్థానికంగా ఉండే వైద్య సిబ్బందికి సమాచారం ఇస్తే అధికారులే ఇంటి వద్దకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా కరోనా పాజిటివ్‌ అని తేలితే వారి పేరు గోప్యంగా ఉంచి మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు.

ఇందులో భాగంగా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి క‌రోనా పరీక్షలు చేయించుకున్న వారిలో ప్రతి వారం ఐదుగురు చొప్పున లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేసి మిక్సీ, గ్రైండర్, గ్యాస్‌ స్టౌ, కుక్కర్‌ తదితర బహుమతులతో పాటు ఒక్కొక్కరికి రూ. 5,500 నగదు బహుమతి అందజేస్తామని వివరించారు. ఈ వారం రోజుల్లో వైద్య పరీక్షలకు ముందుకు వచ్చిన వారిలో లక్కీడిప్‌ ద్వారా ఎంపికైన ఐదుగురు విజేతలకు శనివారం కలెక్టరేట్‌లో బహుమతులు అందజేశారు. కాగా, తూర్పు గోదావరి జిల్లాల్లో శనివారం రాత్రి వరకు 17 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు డిశ్చార్జ్ అయ్యారు.