AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధానిలో ర్యాపిడ్ టెస్ట్‌లు: ఐసీఎంఆర్ అనుమతి

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా స్వైర విహారం చేస్తోంది. అత్యధిక కేసులతో దేశంలో రెండో స్థానంలో ఉన్నతమిళనాడును వెనక్కి నెట్టేసి ఆ స్థానాన్ని ఢిల్లీ ఆక్రమించేసింది. దీంతో రాజధానిలో ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు...

రాజధానిలో ర్యాపిడ్ టెస్ట్‌లు: ఐసీఎంఆర్ అనుమతి
Jyothi Gadda
|

Updated on: Jun 27, 2020 | 3:47 PM

Share

దేశంలో కరోనా కేసుల రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 18,552 కరోనా కేసులు నమోదు కాగా,..ఒక్క రోజు వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,08,953కి చేరగా.. దీనిలో 1,97,387 యాక్టివ్ కేసులు కాగా, 2,95,881 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు తాజాగా 384 మంది కరోనాతో మరణించగా.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 15,685కు చేరింది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా స్వైర విహారం చేస్తోంది. అత్యధిక కేసులతో దేశంలో రెండో స్థానంలో ఉన్నతమిళనాడును వెనక్కి నెట్టేసి ఆ స్థానాన్ని ఢిల్లీ ఆక్రమించేసింది. దీంతో ఢిల్లీలో భారీ స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

దేశ రాజధానిలో వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఐసీఎంఆర్‌ సహకారంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సిరోలాజికల్‌ సర్వే చేపడుతున్నాయి. 27వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ సర్వే జరగనున్నది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ) సంస్థ కూడా ఢిల్లీ ప్రభుత్వానికి సహకరిస్తున్నది. ఢిల్లీలో యాంటిజెన్‌ ఆధారిత ర్యాపిడ్‌ టెస్ట్‌ పరీక్షలను చేపట్టనున్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. దీని కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 50వేల యాంటిజెన్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ సరఫరా చేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొన్నది. ఉచితంగా ఈ కిట్లను ఢిల్లీ ప్రభుత్వానికి అందజేసినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ సిరోలాజికల్‌ పరీక్షలకు తమ వంతు సహకారం అందించింది. దీని కోసం 1.57 లక్షల ఆర్‌ఎన్‌ఏ కిట్లను అందజేసింది. వీటితో పాటు 2.84 లక్షల వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియం(వీటీఎం)లను అందజేసింది. స్వాబ్‌ శ్యాంపిళ్ల సేకరణ కోసం వీటిని వినియోగిస్తారు. ఢిల్లీలో నిర్వహించే పరీక్షల కోసం డయాగ్నస్టిక్ మెటీరియల్‌ను కూడా ఐసీఎంఆర్‌ సరఫరా చేస్తున్నది. ఢిల్లీలో మొత్తం 12 ల్యాబ్‌లు ఇప్పటి వరకు 4.7 లక్షల ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేపట్టాయి. ఆ ల్యాబ్‌లకు డయాగ్నస్టిక్ మెటీరియల్‌ను తామే సరఫరా చేసినట్లు ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

దాసరి ఫ్యామిలీలో ఆస్తి వివాదమేంటి ?

రోడ్డు ప్రమాదం: చిరంజీవి చిన్ననాటి స్నేహితుడి కుటుంబం దుర్మరణం

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..