AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో 2 వేలు దాటిన కరోనా మరణాల సంఖ్య…

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో శనివారం ఒక్కరోజే 3277 కేసులు నమోదు కావడంతోపాటు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 62,939 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 2109కి చేరింది. అటు ఈ వైరస్ నుంచి 19,358 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా మరో 41,472 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌లలోనే […]

Ravi Kiran
|

Updated on: May 10, 2020 | 11:28 AM

Share

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో శనివారం ఒక్కరోజే 3277 కేసులు నమోదు కావడంతోపాటు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 62,939 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 2109కి చేరింది. అటు ఈ వైరస్ నుంచి 19,358 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా మరో 41,472 మంది చికిత్స పొందుతున్నారు.

దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌లలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అయితే కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. అక్కడ కరోనా బాధితుల సంఖ్య 20,228కి చేరగా 779మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ముంబై నగరంలోనే కరోనా కేసుల సంఖ్య 12 వేలు దాటింది. ఇక గుజరాత్ విషయానికి వస్తే.. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 7796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు వైరస్ బారిన పడి 472మంది మరణించారు. ఇక మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3614 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 215మంది ప్రాణాలు విడిచారు. అటు ఢిల్లీలో 6542 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 73మంది వైరస్ బారిన పడి చనిపోయారు. తమిళనాడులో వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తంగా 6535 కేసులు, 44 మరణాలు సంభవించాయి. ఇక రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

కరోనాపై విరుగుడు.. భారత్ మరో ముందడుగు..

ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!

గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు…

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు..

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే