ముస్లిం సోదరులకు పాక్ ప్రధాని గుడ్ న్యూస్.. ప్రార్ధనలకు గ్రీన్ సిగ్నల్..
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ వేళ మసీదుల్లో సమ్మేళన ప్రార్ధనలకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. ఇస్లామాబాద్లో అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మత పెద్దలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మీటింగ్లో ప్రెసిడెంట్ పైవిధంగా నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రేడియో పాకిస్తాన్ తెలిపింది. సమ్మేళన, సామూహిక ప్రార్ధనలను షరతులతో అనుమతించడానికి […]
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ వేళ మసీదుల్లో సమ్మేళన ప్రార్ధనలకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. ఇస్లామాబాద్లో అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మత పెద్దలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మీటింగ్లో ప్రెసిడెంట్ పైవిధంగా నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రేడియో పాకిస్తాన్ తెలిపింది.
సమ్మేళన, సామూహిక ప్రార్ధనలను షరతులతో అనుమతించడానికి ఇరువురూ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మసీదుల్లో కార్పెట్ వేయకూడదని.. ప్రార్ధన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ 6 అడుగుల దూరం పాటించాలని పాక్ ప్రభుత్వం నిబంధనలను విధించింది. అంతేకాకుండా మసీదుకు వచ్చేవారు ఫేస్ మాస్క్ ధరించి, ప్రార్ధన చేసే ముందు 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పిల్లలు, ఫ్లూ, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న 50 సంవత్సరాలు పైబడిన వారికి మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి లేదని ఆల్వి తెలిపారు. కాగా, ఈ నిబంధనలను పాటించకపోయినా.. కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరిగినా ఈ నిర్ణయంపై ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నంలో గత నెలలోనే అక్కడి స్థానిక ప్రభుత్వాలు మసీదులలో సమ్మేళన ప్రార్థనలు, ఇతర మత సమావేశాలను నిరవధికంగా నిషేధించాయి. కాగా, పాకిస్తాన్లో ఇప్పటివరకు 8,418 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 176 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
Also Read:
హిందు, జైనులపై విమర్శలు, ముస్లింలకు నో ఎంట్రీ.. క్యాన్సర్ ఆస్పత్రి నిర్వాకం..
లాక్డౌన్ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..
కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?
చైనాలోని ల్యాబ్లో కరోనా వైరస్ను సృష్టించారు: నోబెల్ గ్రహీత
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..
అత్యవసర ప్రయాణాల కోసం ఈ-పాస్లు.. తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం..
డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…
కరోనా ఎఫెక్ట్…నో షేవింగ్..నో కట్టింగ్ కాదని వెళితే తప్పదు భారీ మూల్యం.!
యువరాజ్ 6 సిక్సర్లు కొట్టే ముందు.. ఫ్లింటాఫ్ ఏమన్నాడంటే.?
లాక్ డౌన్ ఎఫెక్ట్.. భార్య పుట్టింట్లో.. భర్త మాజీ ప్రేయసితో..