బెజవాడ దుర్గమ్మ దర్శనం త్వరలో..
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం భక్తుల దర్శనానికి రెడీ అవుతోంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. అయితే గతంలో లాగా అమ్మవారిని దర్శించుకోవడం మాత్రం అంత ఇప్పుడు ఈజీ కాదంటున్నారు అధికారులు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం భక్తుల దర్శనానికి రెడీ అవుతోంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. అయితే గతంలో లాగా అమ్మవారిని దర్శించుకోవడం మాత్రం అంత ఇప్పుడు ఈజీ కాదంటున్నారు అధికారులు. ఆన్లైన్ దర్శనం నుంచి ఉచిత ప్రసాదాల కౌంటర్ల వరకు అంతటా నిబంధనలు ఉంటాయి.
రూల్స్ పాటించాల్సిందే..
తిరుమల ఆలయం 8 నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కానీ.. దుర్గమ్మ అనుగ్రహం కావాలంటే మాత్రం మరో రెండ్రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు అమ్మ ఆలయంలోకి ఎంట్రీ అయినప్పటి నుంచి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లే వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అలాగే ప్రతి భక్తుడిపై నిఘా కూడా ఉంచుతున్నారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న సంకేతాలు కూడా ఇస్తున్నారు.
క్యూలైన్స్లో సర్కిల్స్…
దుర్గమ్మ క్యూలైన్స్ దగ్గర నిబంధనలు పక్కాగా అమలయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. క్యూలైన్స్లో కేటాయించిన సర్కిల్స్లోనే భక్తులు నిల్చోవాల్సి ఉంటుంది. అమ్మ దర్శనం కోసం వచ్చే వారికి కరోనా జాగ్రత్తలు కూడా ఆలయ అధికారులు తీసుకున్నారు. ఆలయంలోకి ఎంట్రీ అయిన ప్రతి భక్తుడ్ని థర్మల్ పరీక్షిస్తారు. అలాగే ఎక్కడ అవసరమో… అక్కడ హ్యాండ్ శానిటైజర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
స్పెషల్ పూజలు..
అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు ఆలయ ప్రాంగణంలో కొన్ని స్పెషల్ పూజలు కూడా చేయించేవారు. దాదాపు 10కి పైగా ప్రత్యేక పూజలు జరిగేవి. అయితే కరోనా నేపధ్యంలో పూజలు చేయించుకునే భక్తులు తప్పక లాక్డౌన్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది. క్రౌడ్ లేకుండా పరిమిత సంఖ్యలోనే పూజలు జరిగేలా ఏర్పాట్లు చేశారు.