AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా:‘సెన్సిటివ్ గుండె’కు తప్పదు హైరానా !.. స్టడిలో తేలిన నిజం!

ప్రపంచ దేశాలను పట్టిపీడుస్తున్న మహమ్మారి కరోనా లక్షణాలు ఏంటి అనే దానిపై రోజు రోజుకూ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. జలుబు,దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో పాటు అందులో కొత్త లక్షణాలు వచ్చి చేరాయి. కరోనా సోకిన రోగుల్లో ఇప్పుడు మరికొన్ని లక్షణాలను గుర్తించారు...కాగా, తాజా అధ్యయనంలో..

కరోనా:‘సెన్సిటివ్ గుండె’కు తప్పదు హైరానా !.. స్టడిలో తేలిన నిజం!
Jyothi Gadda
|

Updated on: Jul 02, 2020 | 2:05 PM

Share

ప్రపంచ దేశాలను పట్టిపీడుస్తున్న మహమ్మారి కరోనా లక్షణాలు ఏంటి అనే దానిపై రోజు రోజుకూ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. జలుబు,దగ్గు, జ్వరం వంటి లక్షణాలుంటే వాటిని కరోనాగా గుర్తించేవారు. ఆ తరువాత అందులో కొత్త లక్షణాలు వచ్చి చేరాయి. కరోనా సోకిన రోగుల్లో ఇప్పుడు మరికొన్ని లక్షణాలను గుర్తించారు. వికారం, వాంతులు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో వైరస్ సోకిన వారిలో వికారంగా ఉండటం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పాటు చాలామందికి వాంతులు అవుతున్నాయి. మోకాళ్ల నుంచి కింది భాగంలో నొప్పులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఇక మరికొంత మందిలో ఈ వాంతులతో పాటుగా డయేరియా లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే, ఇవన్నీ పైకి కనిపించే లక్షణాలే అయినప్పటికీ మనిషిలోకి ప్రవేశించిన వైరస్ నేరుగా గుండెకూ హాని చేస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైనట్లుగా అమెరికాలోని సెడార్స్- సినాయ్ వైద్య విజ్ఞాన సంస్థ హృద్రోగ నిపుణులు వెల్లడించారు. మూల కణాల(స్టెమ్‌ సెల్స్‌) నుంచి సేకరించిన గుండె కండర కణాలకు.. ప్రయోగశాలలో కరోనా ఇన్ఫెక్షన్‌ను కలుగజేసినప్పుడు జరిగిన మార్పుల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు అధ్యయన బృందం వెల్లడించింది. ఈ కణాల్లో వైరస్‌ సులభంగా చేరిపోతుందని చెప్పారు. వాటితో పాటు వాటి నడుమ చాలా వేగంగా తన సంఖ్యనుపెంచుకోగలుగుతోందని గుర్తించినట్లు పేర్కొన్నారు.