హిందు, జైనుల‌పై విమ‌ర్శ‌లు, ముస్లింల‌కు నో ఎంట్రీ.. క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి వివాదాస్పద ప్రకటన..

కరోనాకు జాతి, మతం, కులం అనే బేధా లేదని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అంతేకాక అన్ని ఆసుపత్రుల్లోనూ కరోనా బాధితులకు ఒకేలా ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రి యాజ‌మాన్యం వివాదాస్పదమైన ప్రకటనను జారీ చేసింది. క్యాన్సర్ పేషంట్లకు చికిత్సను అందించే సదరు హాస్పిటల్ ముస్లింలపై విపక్షను చూపించేలా ఓ యాడ్‌ను రూపొందించింది. కరోనా పరీక్షలు నిర్వహించుకుని, ఆ రిపోర్టుల్లో నెగటివ్ అని తేలిన తర్వాతే రోగులు, వారి సహాయానికి వచ్చేవారు ఆసుపత్రికి రావాలని […]

హిందు, జైనుల‌పై విమ‌ర్శ‌లు, ముస్లింల‌కు నో ఎంట్రీ.. క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి వివాదాస్పద ప్రకటన..

Updated on: Apr 20, 2020 | 4:38 PM

కరోనాకు జాతి, మతం, కులం అనే బేధా లేదని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అంతేకాక అన్ని ఆసుపత్రుల్లోనూ కరోనా బాధితులకు ఒకేలా ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రి యాజ‌మాన్యం వివాదాస్పదమైన ప్రకటనను జారీ చేసింది. క్యాన్సర్ పేషంట్లకు చికిత్సను అందించే సదరు హాస్పిటల్ ముస్లింలపై విపక్షను చూపించేలా ఓ యాడ్‌ను రూపొందించింది. కరోనా పరీక్షలు నిర్వహించుకుని, ఆ రిపోర్టుల్లో నెగటివ్ అని తేలిన తర్వాతే రోగులు, వారి సహాయానికి వచ్చేవారు ఆసుపత్రికి రావాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు ఆ ప్రకటనలో హిందూ, జైన్ పేషంట్లపై కూడా ఆసుపత్రి వర్గాలు వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఈ మతాలకు చెందిన సంపన్నులు పిసినారులను.. వారంతా పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ప్రకటనపై అన్ని వర్గాల వారి నుంచి వ్యతిరేకత రావడంతో ఆసుపత్రి యాజమాన్యం వెనక్కి తగ్గింది. కానీ అప్పటికే కొంతమంది వారి నిర్వాకంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కరోనా వైరస్ ఉత్తరప్రదేశ్‌లో విలయం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 1084 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..

అత్యవసర ప్రయాణాల కోసం ఈ-పాస్‌లు.. తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం..

డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…