పాక్లో డిన్నర్ టైమ్కు కరోనా వస్తుందట..
ప్రపంచానికి కరోనాపై తీపికబురు చెప్పిన పాకిస్తాన్ ప్రధాని అంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో సారాంశం ఏంటంటే...
ప్రపంచదేశాలను భయపెడుతున్న కరోనా వైరస్.. ఆ దేశంలో టైమింగ్ పెట్టుకుని మరీ వ్యాప్తి చెందుతుందట. వినడానికి ఇది కొంచెం విడ్డూరంగా ఉన్నా, నిజమండీ.. స్వయంగా ఈ వ్యాఖ్యలు ఆ దేశ గవర్నర్లలో ఒకరు చేసినవే. ఇక ఆ దేశం మరేదో కాదు దాయాది పాకిస్తాన్. ప్రపంచానికి కరోనాపై తీపికబురు చెప్పిన పాకిస్తాన్ ప్రధాని అంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియో సారాంశం ఏంటంటే… అక్కడ స్థానిక న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ దేశ గవర్నర్ ఒకరు ‘సాయంత్రం పూట 5 గంటల తర్వాత పాకిస్తాన్లో కరోనా వైరస్ వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో సాయంత్రం 5 గంటలలోపు ప్రజలందరూ కూడా ఎక్కడికైనా తిరవచ్చునని, ఎలాంటి ఇబ్బంది ఉండదని అని అక్కడ స్థానిక న్యూస్ ఛానల్స్లలో వార్తలు వచ్చాయి. ఇక దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. పాకిస్తాన్లో కరోనా టైమింగ్ పెట్టుకుని వ్యాప్తి చెందుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Pakistan’s Best Research in history ever pic.twitter.com/SmDLbnZd22
— Đesi Thug ® (@desi_thug1) May 16, 2020
Read More:
ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు!
వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్
తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..