ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల లిస్టును జిల్లాల వారీగా వెల్లడించింది. ఈ మేరకు 'ఆరోగ్య ఆంధ్ర' ట్విట్టర్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకూ క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2205 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 49 మంది ప్రాణాలు విడిచారు. అటు 1353 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల లిస్టును జిల్లాల వారీగా వెల్లడించింది. ఈ మేరకు ‘ఆరోగ్య ఆంధ్ర’ ట్విట్టర్లో పేర్కొంది.
- కృష్ణా జిల్లాలో ప్రాంతాలు.. జగ్గయ్యపేట, విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, పెనమలూరు, మచిలీపట్నం, నూజీవిడు, ముసునూరు.
- కర్నూలు జిల్లా… ఆదోని, చిప్పగిరి, ఆస్పరి, తుగ్గలి, ఆత్మకూరు, కోడుమూరు, కర్నూలు టౌన్, నందికోట్కూరు, పాణ్యం, బనగానిపల్లె, నంద్యాల, గడివేముల, చాగలమర్రి, పాములపాడు.
- కడప జిల్లా.. మైదుకూరు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప టౌన్, బద్వేల్, పులివెందుల, కమలాపురం.
- నెల్లూరు జిల్లా… నెల్లూరు టౌన్, నాయుడుపేట, వాకాడు, సూళ్ళురుపేట, తడ ప్రాంతాలు.
- ప్రకాశం జిల్లా… కారంచేడు, చీరాల, ఒంగోలు టౌన్, గుడ్లూరు ప్రాంతాలు.
- అనంతపురం జిల్లా.. హిందూపూర్, కల్యాణదుర్గం, అనంతపురం టౌన్
- చిత్తూరు జిల్లా.. శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్, రేణిగుంట, పరదయపాలెం, సత్యవేడు, నాగలాపురం, నగిరి, పుత్తూర్, వెంకటగారికోట.
- తూర్పుగోదావరి జిల్లా… సామర్లకోట, పెద్దాపురం, కొత్తపేట, రాజమండ్రి అర్బన్, పిఠాపురం, శంఖవరం.
- గుంటూరు జిల్లా… మాచర్ల, దాచేపల్లి, అచ్చంపేట, నరసరావుపేట, గుంటూరు టౌన్, తాడేపల్లి, మంగళగిరి.
- విశాఖపట్నం జిల్లా… పెదగంట్యాడ, నర్సీపట్నం, కశింకోట, పెందుర్తి, విశాఖపట్నం అర్బన్, పద్మనాభం.
- విజయనగరం జిల్లా… బొందపల్లె, పూసపాటిరేగ, కొమరాడ, బలిజిపేట ప్రాంతాలు.
- పశ్చిమ గోదావరి జిల్లా… పోలవరం, గోపాలపురం, టి, నరసాపురం, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, పెనుగొండ, భీమడోలు, ఏలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, నరసాపురం
Read More:
తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..