AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. ఒక్కరోజే 326 కేసులు..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందుతుంది. అంతేకాదు.. మహారాష్ట్రలో కరోనా కేసులతో పాటుగా.. మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లో శుక్రవారం ఒక్కరోజే నమోదైన కేసులు చూస్తే షాకింగ్‌కు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 326 కరోనా  కేసులు నమోదైనట్లు గుజరాత్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,721కి చేరింది. కాగా.. కరోనా […]

గుజరాత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. ఒక్కరోజే 326 కేసులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 01, 2020 | 9:06 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందుతుంది. అంతేకాదు.. మహారాష్ట్రలో కరోనా కేసులతో పాటుగా.. మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లో శుక్రవారం ఒక్కరోజే నమోదైన కేసులు చూస్తే షాకింగ్‌కు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 326 కరోనా  కేసులు నమోదైనట్లు గుజరాత్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,721కి చేరింది. కాగా.. కరోనా బారనపడి 236 మంది మృతి చెందినట్లు గుజరాత్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి జయించి 736 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు.

కాగా.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,755 కరోనా కేసులు నమోదైరనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక గడిచిన 24 గంటల్లో 77 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇక తాజాగా నమోదైన కేసుల సంఖ్య 35,365కు చేరింది.