షాకింగ్.. ఆ బస్సులో వెళ్లిన వలస కార్మికుల్లో ఏడుగురికి కరోనా..!

| Edited By:

May 02, 2020 | 4:41 PM

లాక్‌డౌన్ నేపథ్యంలో 40 రోజులుగా ఎక్కడిక్కడే చిక్కుకుని అవస్థలు పడుతున్న కార్మికులు, కూలీలు, మత్య్సకారులను వారి స్వస్థలాలకు పంపేందుకు

షాకింగ్.. ఆ బస్సులో వెళ్లిన వలస కార్మికుల్లో ఏడుగురికి కరోనా..!
Follow us on

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో 40 రోజులుగా ఎక్కడిక్కడే చిక్కుకుని అవస్థలు పడుతున్న కార్మికులు, కూలీలు, మత్య్సకారులను వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు, బస్సుల్లో కార్మికులను వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది తమ ఇళ్లకు చేరుకున్నారు. కాగా తాజాగా వలస కార్మికుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ సోకింది. మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు వెళ్లిన ఏడుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రభుత్వ బస్సుల్లో వీరు ఝాన్సీ మీదుగా బస్తీకి వెళ్లారు. ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా వర్గాలు వెల్లడించాయి. దీంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. వారు ఎవరెవరిని కలిశారు..? అన్న దానిపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

Read This Story Also: ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్ష.. జగన్ మరో కీలక నిర్ణయం..!