ఏపీలో విపరీతంగా కరోనా వ్యాప్తి.. ఈ రోజు ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,127 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 6,051 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు..

ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,127 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 6,051 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 99,454కి చేరింది. ఇందులో 51,683 యాక్టివ్ కేసులు ఉండగా.. 46,681 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 24 గంటల్లో ఈ కరోనా వల్ల 49 మంది మరణించారు. వీటితో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 1090కి చేరింది.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలుః అనంతపురంలో 524, చిత్తూరులో 367, ఈస్ట్ గోదావరిలో 1210, గుంటూరులో 774, కడపలో 336, కృష్ణలో 127, కర్నూలులో 664, నెల్లూరులో 422, ప్రకాశంలో 371, శ్రీకాకుళంలో 120, విశాఖపట్నంలో 655, విజయనగరంలో 157, వెస్ట్ గోదావరిలో 408 కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు 16,86,446 సాంపిల్స్ ని పరీక్షించారు.
#COVIDUpdates: 27/07/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 99,454 పాజిటివ్ కేసు లకు గాను *46,681 మంది డిశ్చార్జ్ కాగా *1090 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 51,683#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/vyn03RbsYU
— ArogyaAndhra (@ArogyaAndhra) July 27, 2020
Read More:
ఎంపీ సోయం బాపూరావుకు అస్వస్థత..
గణేష్ నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి కీలక నిర్ణయం..