ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మృతి
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు మస్కు నర్సింహా(52) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింహా.. ఐదు రోజుల క్రితం చికిత్స. కోసం నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. నర్సింహా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో..
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు మస్కు నర్సింహా(52) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింహా.. ఐదు రోజుల క్రితం చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. నర్సింహా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
కాగా మస్కు నర్సింహా 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సీపీఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ అంతర్గత విషయంలో సీపీఐలో చేరారు. 2015లో మళ్లీ సీపీఎంలో చేరారు. ప్రస్తుతం వ్యవసాయ కార్మిక సంఘంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. నియోజకవర్గ ప్రజల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు.
Read More:
పక్షి పిల్లల కోసం 40 రోజులుగా ఆ గ్రామంలో వెలగని వీధి లైట్లు..
పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో పూర్తిస్థాయి లాక్డౌన్..