పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో పూర్తిస్థాయి లాక్డౌన్..
ఏపీలో ప్రస్తుతం విపరీతంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలవుతోన్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాల్లోని కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నారు అధికారులు. ఇక ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, తాడేపల్లి గూడెం, భీమవరం నియోజకవర్గాల్లో..
ఏపీలో ప్రస్తుతం విపరీతంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలవుతోన్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాల్లోని కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నారు అధికారులు. ఇక ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, తాడేపల్లి గూడెం, భీమవరం నియోజకవర్గాల్లో లాక్ డౌన్ అమలు పరుస్తున్నారు. తాజాగా ఇప్పుడు కొవ్వూరు నియోజక వర్గంలో కూడా లాక్డౌన్ అమలు చేస్తున్నారు అధికారులు. నేటి నుంచి లాక్డౌన్ అక్కడ అమలు కాబోతుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటలు అంటే కేవలం మూడు గంటలు మాత్రమే షాపులు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చారు.
నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాల బూత్లు తెరిచేందుకు మాత్రమే అధికారులు పర్మిషన్ ఇచ్చారు. ఉదయం 9 గంటల తరువాత ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రాకూడదని ఆదేశాలు జారీ చేశారు ఆ జిల్లా అధికారులు. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు జిల్లా అధికారులు. కాగా గడిచిన 24 గంటల్లో 47,645 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 7627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. వీటిల్లో 48,956 యాక్టివ్ కేసులు ఉండగా.. 46,301 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1041కి చేరుకుంది.
Read More:
ప్రపంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న కరోనా మహమ్మారి..
తెలుగు రాష్ట్రాల్లో ఆగని కరోనా వ్యాప్తి.. ఉధృతంగా కేసులు..