తెలుగు రాష్ట్రాల్లో ఆగ‌ని క‌రోనా వ్యాప్తి.. ఉధృతంగా కేసులు..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే..

తెలుగు రాష్ట్రాల్లో ఆగ‌ని క‌రోనా వ్యాప్తి.. ఉధృతంగా కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 7:53 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే.. గడిచిన 24 గంటల్లో 47,645 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 7627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. వీటిల్లో 48,956 యాక్టివ్ కేసులు ఉండగా.. 46,301 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1041కి చేరుకుంది.

అటు ఆదివారం 3041 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 56 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. నిన్న ఒక్క రోజే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పుగోదావరిలో 1095, పశ్చిమగోదావరిలో 859 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 734, చిత్తూర్ 573, గుంటూరు 547, కడప 396, కృష్ణ 332, నెల్లూరు 329, ప్రకాశం 242, శ్రీకాకుళం 276, విజయనగరం 247, విశాఖపట్నం 784 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 13,486 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కర్నూలులో 162 కరోనా మరణాలు సంభవించాయి.

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 1593 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. కాగా కొత్తగా ఎనిమిది మంది వైరస్ కారణంగా చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 54,059కి చేరగా.. మృతుల సంఖ్య 463కి చేరుకుంది. నిన్న 998 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 41,332 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణలో 12,264 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 15,654 టెస్టింగ్స్ జరగ్గా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,53,425 మందికి టెస్టులు జరిగాయి.

ఇక జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో అత్యధికంగా 640 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 171, వరంగల్‌ అర్బన్‌ 131, మేడ్చల్‌ 91, కరీంనగర్‌ 51, నాగర్‌కర్నూల్‌ 46, ఆదిలాబాద్‌ 14, భద్రాద్రి 17, జగిత్యాల 2, జనగామ 21, భూపాలపల్లి 3, జోగులాంబ గద్వాల 5, కామారెడ్డి 36, ఖమ్మం 18, మహబూబ్‌నగర్ 38, మహబుబాబాద్ 29, మంచిర్యాల 27, మెదక్ 21, ములుగు 12, నల్లగొండ 6, నారాయణపేట 7, నిర్మల్ 1, నిజామాబాద్‌ 32, పెద్దపల్లి 16, సిరిసిల్ల 27, సంగారెడ్డి 61, సిద్దిపేట 5, సూర్యాపేట 22, వికారాబాద్ 9, వనపర్తి 1, వరంగల్‌ రూరల్ 21, యాదాద్రి భువనగిరిలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??