పక్షి పిల్లల కోసం 40 రోజులుగా ఆ గ్రామంలో వెలగని వీధి లైట్లు..
గత 40 రోజులుగా తమిళనాడు శివగంగ జిల్లాలోని పొత్తకూడి గ్రామంలో వీధి లైట్లు వెలగడం లేదు. గ్రామస్తులే ఆ వీధి లైట్లను వెలగనీయకుండా చేస్తున్నారు. ఎందుకా అని అంటారా? ఓ చిన్న పక్షి పిల్లల్ని కాపాడేందుకు. అవును.. ఇది నిజం. ఆ ఊళ్లోకి 50 రోజుల కిందట..
గత 40 రోజులుగా తమిళనాడు శివగంగ జిల్లాలోని పొత్తకూడి గ్రామంలో వీధి లైట్లు వెలగడం లేదు. గ్రామస్తులే ఆ వీధి లైట్లను వెలగనీయకుండా చేస్తున్నారు. ఎందుకా అని అంటారా? ఓ చిన్న పక్షి పిల్లల్ని కాపాడేందుకు. అవును.. ఇది నిజం. ఆ ఊళ్లోకి 50 రోజుల కిందట.. అరుదైన ఇండియన్ రాబిన్ లే అనే పక్షి జంట వచ్చింది. వీధిలైట్లు ఆన్ చేసే మెయిన్ స్విట్చ్ బోర్డు పక్కన గూడు కట్టి మూడు గుడ్లు పెట్టాయి. సాధారణంగా రోజూ లాగే లైట్లు ఆన్ చేసేందుకు ఓ గ్రామస్తుడు అక్కడికి రాగానే పక్షులు టెన్షన్ పడటం గమనించాడు. దీంతో ఈ విషయాన్ని ఆ ఊరిలోని గ్రామస్తులకు చెప్పాడు.
ఆ రాబిన్ లే గుడ్లు గమనించిన గ్రామస్తులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ గుడ్లు పిల్లలు అయ్యేంతవరకూ వీధిలో లైట్లు వేయవద్దని నిర్ణయించారు. దీంతో మొత్తంగా ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామంలోని మొత్తం 35 వీధి లైట్లు.. 40 రోజులుగా వెలగటం లేదు. ఆ గ్రామస్తులంతా ఓ యజ్ఞంలా ఆ పక్షి గుడ్లను, గూడునూ కాపాడుతూ వస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ మూడు గుడ్ల నుంచి బ్లూ కలర్ రాబిన్ లే పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో మొత్తంగా ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా నలిచిపోయింది. గ్రామంలోని మొత్తం 35 వీధి లైట్లు.. 40 రోజులుగా వెలగటం లేదు.
Read More:
పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో పూర్తిస్థాయి లాక్డౌన్..
ప్రపంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న కరోనా మహమ్మారి..
తెలుగు రాష్ట్రాల్లో ఆగని కరోనా వ్యాప్తి.. ఉధృతంగా కేసులు..