AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవిడ్-19 ఎఫెక్ట్ : తెలంగాణ ప్రజాప్రతినిధులపై కరోనా ప్రభావం

‘కరోనా వైరస్’కు ప్రపంచమే గడగడలాడుతోంది. ఇప్పటికే 70 దేశాల ప్రజలు గజ గజా వణుకుతున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ కు మందు కనుగొన లేదు. కనీసం వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. జనం బిక్కు బిక్కుమంటూ వైద్యం కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా కట్టడిలో అనుసరించాల్సిన అన్ని ప్రయత్నాలను చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత్‌లో ఐదు విడతలుగా లాక్‌డౌన్‌ను అమలులోకి తీసుకొచ్చింది. అయినా పెద్ద కరోనా విజృంబన ఆగడటం లేదు. […]

కొవిడ్-19 ఎఫెక్ట్ : తెలంగాణ ప్రజాప్రతినిధులపై కరోనా ప్రభావం
Sanjay Kasula
|

Updated on: Jun 13, 2020 | 9:42 AM

Share

‘కరోనా వైరస్’కు ప్రపంచమే గడగడలాడుతోంది. ఇప్పటికే 70 దేశాల ప్రజలు గజ గజా వణుకుతున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ కు మందు కనుగొన లేదు. కనీసం వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. జనం బిక్కు బిక్కుమంటూ వైద్యం కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా కట్టడిలో అనుసరించాల్సిన అన్ని ప్రయత్నాలను చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత్‌లో ఐదు విడతలుగా లాక్‌డౌన్‌ను అమలులోకి తీసుకొచ్చింది. అయినా పెద్ద కరోనా విజృంబన ఆగడటం లేదు. రోజు రోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఇప్పటికే కరోనా పీడిస్తున్న దేశాల లిస్టులో ఇండియా టాప్ 5లోకి చేరిపోయింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం కొవిడ్-19 విరుచుకుపడుతోంది. కరోనాకు వారు వీరు అనే తేడా లేకుండా అందరిని పట్టి పీడిస్తోంది. సామాన్యులతోపాటు కరోనాపై ముందువరుసలో ఉండిపోరాడుతున్న వైద్యులు, పోలీసులను కూడా బలితీసుకుంది. ఇప్పుడు తాజాగా ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్‌ కరోనా బారిన పడ్డాడు. అతడు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు వెల్లడించడంతో. అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రజా కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసుకుంటున్నారు ప్రజా ప్రతినిధులు. మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆంక్షలను విధించారు. అంతే కాకుండా తమ వ్యక్తిగత సిబ్బందికి కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. కొందరు మంత్రులు సగం మంది సిబ్బందిని తగ్గించుకున్నారు. కరోనా జాగ్రత్తల్లో భాగంగా ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తన వ్యక్తిగత సిబ్బందిని తగ్గించుకున్నారు. స్వయంగా తానే కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు.