AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రగతి భవన్‌లో కరోనా కలకలం.. నలుగురు సిబ్బందికి కోవిడ్..

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే పలు ఆంక్షలు కూడా జారీ చేసింది ప్రభుత్వం. కరోనాను కట్టడి చేయడానికై కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు...

ప్రగతి భవన్‌లో కరోనా కలకలం.. నలుగురు సిబ్బందికి కోవిడ్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 03, 2020 | 11:41 AM

Share

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే పలు ఆంక్షలు కూడా జారీ చేసింది ప్రభుత్వం. కరోనాను కట్టడి చేయడానికై కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినప్పటికీ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో 70 నుంచి 80 శాతం వరకూ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వైద్యులు, నటులు సైతం ఈ వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ప్రగతి భవన్‌లో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. దానితో వెంటనే రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రగతి భవన్ మొత్తం శానిటైజ్ చేశారు. అంతేకాకుండా కరోనా లక్షణాలు ఉన్న పలువురిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కాగా ముఖ్యమంత్రి గత నాలుగు రోజుల నుంచి గజ్వేల్‌లోని ఆయన నివాసంలోనే ఉంటున్నారు. ఇక ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read More:

పీఎఫ్ విత్‌డ్రా చేసుకున్నారా? పన్ను పడే ఛాన్స్ ఉందట!

ఉత్తరాది రాష్ట్రాల్లో పిడుగులు.. ఒక్క రోజే 31 మంది మృతి..