AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నుంచి కోలుకున్న చింతల.. ఫ్యామిలీ స‌హా ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్

క‌రోనా వైరస్ సామాన్య ప్రజలనే కాదు... ప్రజా ప్రతినిధులను కూడా వెంటాడుతున్న విష‌యం తెలిసింది. ఈ క్ర‌మంలోనే కోవిడ్ బారిన‌ప‌డ్డ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనా నుంచి కోలుకున్న చింతల.. ఫ్యామిలీ స‌హా ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2020 | 11:45 AM

Share

క‌రోనా వైరస్ సామాన్య ప్రజలనే కాదు… ప్రజా ప్రతినిధులను కూడా వెంటాడుతున్న విష‌యం తెలిసింది. ఈ క్ర‌మంలోనే కోవిడ్ బారిన‌ప‌డ్డ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. చింతలతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప్రతిలో చికిత్స పొందిన వారంతా డిశ్చార్జ్ అయ్యారు. వీరందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. పుట్టిన రోజు ముందు ఆయన కరోనాను జయించి ఇంటికి చేరడం పట్ల బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మే నెల చివర్లో చింతల రామచంద్రారెడ్డిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయనతోపాటు భార్య, కుమారుడిని సైతం ఆస్ప్ర‌తికి తరలించి టెస్ట్ చేయగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. జూన్ 1న ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా.. తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని చింతల వెల్ల‌డించారు.