AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రయాణీకులకు గుడ్‌న్యూస్: విదేశీ రాకపోకలకు త్వరలోనే గ్రీన్‌సిగ్నల్!

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా అంతర్ రాష్ట్ర రాకపోకలకు అవకాశం కల్పించిన కేంద్రం..తాజాగా..అంతర్జాతీయ విమానాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు..

విమాన ప్రయాణీకులకు గుడ్‌న్యూస్: విదేశీ రాకపోకలకు త్వరలోనే గ్రీన్‌సిగ్నల్!
Jyothi Gadda
|

Updated on: Jun 04, 2020 | 3:52 PM

Share

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా అంతర్ రాష్ట్ర రాకపోకలకు అవకాశం కల్పించిన కేంద్రం..తాజాగా..అంతర్జాతీయ విమానాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. జులై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని..కాస్తా సాధారణ పరిస్థితులు రాగానే వెంటనే అంతర్జాతీయ విమానాల రాకపోకలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. కాగా రెండు నెలల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల వ్యవధిలో అత్యధిక కేసులతో ప్రస్తుతానికి దేశం 2లక్షల మార్క్‌ను దాటేసింది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు అంతర్జాతీయ విమానాలను అనుమతించటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.