ఇంత ఘోరమా.. మర్కజ్ వెళ్లొచ్చిన వారి వివరాలు కోసం వెళ్లిన ఆశా వర్కర్లపై..

| Edited By:

Apr 03, 2020 | 8:15 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు.. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పాజిటివ్ కేసులు రెండు వేలకు పైగా నమోదవ్వగా.. యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మీటింగ్‌లో పాల్గొన్న వారందరినీ కరోనా టెస్టులు చేయించుకోవాలని.. వారంతా క్వారంటైన్‌లోనే ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు అక్కడికి ఎవరెవరు వెళ్లారో స్వచ్ఛందంగా వచ్చి సమీప అధికారులకు వివరాలు తెలపాలని సూచించారు. అయితే […]

ఇంత ఘోరమా.. మర్కజ్ వెళ్లొచ్చిన వారి వివరాలు కోసం వెళ్లిన ఆశా వర్కర్లపై..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు.. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పాజిటివ్ కేసులు రెండు వేలకు పైగా నమోదవ్వగా.. యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మీటింగ్‌లో పాల్గొన్న వారందరినీ కరోనా టెస్టులు చేయించుకోవాలని.. వారంతా క్వారంటైన్‌లోనే ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు అక్కడికి ఎవరెవరు వెళ్లారో స్వచ్ఛందంగా వచ్చి సమీప అధికారులకు వివరాలు తెలపాలని సూచించారు. అయితే అక్కడికి వెళ్లి వచ్చి.. ఇప్పటి వరకు అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఉన్నవారి గురించి ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. వారిని తక్షణమే గుర్తించి.. కరోన పరీక్షలు చేయించాలని సూచించింది.

ఈ క్రమంలోఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మర్కజ్ మీటింగ్‌లకు హాజరైన వారిని గుర్తించేందుకు ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు.జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో ఓ ఆశా వర్కర్‌పై ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తి దాడికి పాల్పడ్డేందుకు ప్రయత్నించాడు. అతని కుటుంబం ఆశా వర్కర్లపై దుర్భాషలాడుతూ దాడికి దిగబోయారు. దీంతో వెంటనే వారు అక్కడి నుంచి బయటపడ్డారు. అక్కడి నుంచి డీ అండ్ హెచ్‌వో ఆఫీస్‌లోఅధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లి ఫిర్యాదు చేసి..తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఆశా వర్కర్లు ఎంతో రిస్క్‌ తీసుకుని.. వారి ఆరోగ్యం కోసం సర్వే చేస్తుంటే.. వారిక సహకరించాల్సింది పోయి.. ఇలా దాడలుకు దిగడంపై స్థానికులు నివ్వెరపోతున్నారు.