జనవరికల్లా కరోనా వ్యాక్సిన్!.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

|

Sep 29, 2020 | 5:43 PM

కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే, వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమన్నారు.

జనవరికల్లా కరోనా వ్యాక్సిన్!.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
Follow us on

కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే, వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమన్నారు. పాజిటివిటీ రేట్‌ 12.0 నుంచి 8.3కి తగ్గిందన్నారు. టెస్టులు పెరిగాయని, కేసులు కూడా తగ్గుతున్నాయని చెప్పారు. కరోనా నివారణ చర్యలపై మంగళవారం సమీక్షించారు సీఎం. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు.

జనవరికల్లా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం కనిపిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కింద కరోనాకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. కోవిడ్‌ ఆస్పత్రుల జాబితా గ్రామ సచివాలయాల్లో ఉండాలని సీఎం జగన్ సూచించారు. ఎంప్యానల్‌ ఆస్పత్రుల లిస్టు కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. 104 నంబర్‌కు ఫోన్‌ కొట్టిన వెంటనే టెస్ట్‌లు, హాస్పిటల్స్ వివరాలు అందాలని సీఎం జగన్ అన్నారు. ఎక్కడైనా లోటుపాట్లుంటే వెంటనే సరి చేసుకోవాలని.. ప్రతిరోజూ మానిటర్‌ చేయాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.