AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు బెంగాల్, ఒడిశాలలో ప్రధాని పర్యటన..

‘ఉమ్‌పున్’ తుఫాన్ కారణంగా అతలాకుతలం అవుతున్న పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ముందుగా ప్రధాని బెంగాల్‌లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్ధన మేరకు మోదీ ఈ పర్యటన చేయనున్నారు. అటు ఒడిశాలో సైతం ప్రధాని ఏరియల్ సర్వే చేసి.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై చర్చించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘ఉమ్‌పున్’ తుఫాన్‌గా మారి ఒడిశా, బెంగాల్‌ […]

నేడు బెంగాల్, ఒడిశాలలో ప్రధాని పర్యటన..
Ravi Kiran
|

Updated on: May 22, 2020 | 1:05 AM

Share

‘ఉమ్‌పున్’ తుఫాన్ కారణంగా అతలాకుతలం అవుతున్న పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ముందుగా ప్రధాని బెంగాల్‌లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్ధన మేరకు మోదీ ఈ పర్యటన చేయనున్నారు.

అటు ఒడిశాలో సైతం ప్రధాని ఏరియల్ సర్వే చేసి.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై చర్చించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘ఉమ్‌పున్’ తుఫాన్‌గా మారి ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. కాగా, బెంగాల్‌లో ఈ తుఫాన్ కారణంగా ఏకంగా 72 మంది మృత్యువాతపడ్డారు.

Read This: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. రైల్వేశాఖ మరో కీలక ప్రకటన..