AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిమాని అద్భుతమైన స్కెచ్.. జీవితానికి ఇది చాలంటున్న సోనూ..

లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు సహాయం అందిస్తూ.. వారి పాలిట దైవంగా మారారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్. లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు స్వస్థలాలకు వెళ్లేలా బస్సులు, ట్రైన్లను...

అభిమాని అద్భుతమైన స్కెచ్.. జీవితానికి ఇది చాలంటున్న సోనూ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 11, 2020 | 1:45 PM

Share

లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు సహాయం అందిస్తూ.. వారి పాలిట దైవంగా మారారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్. లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు క్షేమంగా స్వస్థలాలకు వెళ్లేలా బస్సులు, ట్రైన్లను ఏర్పాటు చేస్తూ బాసటగా నిలిచారు సోనూ. ఈ క్రమంలోనే ఆయనపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్త పరుస్తూ ఓ ఆర్టిస్ట్ అద్బుతమైన స్కెచ్ వేశాడు. అసోంకు చెందిన రణ్‌బీర్ అనే కళాకారుడు వలస కార్మికుల జీవన స్థితిగతులను ఉద్ధేశిస్తూ సోనూసూద్ రూపం వచ్చేలా చిత్రాన్ని గీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

ఈ ఫోటోలను చూసిన సోనూసూద్ ట్విట్టర్‌లో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ స్కెచ్‌తో తన జీవితానికి ఓ గుర్తింపు లభించినట్టైందని పేర్కొన్నారు. ఇంతటి అద్భుతమైన కళాత్మకతకు ప్రాణం పోసిన ఆర్టిస్ట్‌ను తాను కలవాలనుకుంటున్నట్లు ట్వీట్‌లో తెలిపారు.