AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 వేలకు చేరువలో రాజస్థాన్‌ కేసులు.. తాజా వివరాలు ఇవే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా బారినపడి ఇప్పటికే ఐదు వేల మందికి పైగా మరణించారు. ఇక ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌ల నుంచి పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం నాడు రాజస్థాన్‌లో మరో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. […]

10 వేలకు చేరువలో రాజస్థాన్‌ కేసులు.. తాజా వివరాలు ఇవే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 03, 2020 | 4:35 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా బారినపడి ఇప్పటికే ఐదు వేల మందికి పైగా మరణించారు. ఇక ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌ల నుంచి పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం నాడు రాజస్థాన్‌లో మరో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 9475కి చేరింది. ఈ విషయాన్ని రాజస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 2,766 యాక్టివ్ కేసులు ఉన్నాయని..203 మంది కరోనా బారినపడి మరణించారని తెలిపారు. కాగా, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,07,615కి చేరింది. వీరిలో 1,01,497 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇక 1,00,303 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు 5,815 మంది మరణించినట్లు పేర్కొన్నారు.