AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gurukula Admissions:పేదింటి విద్యార్ధులకు సువర్ణావకాశం.. 26, 27 తేదీల్లో గురుకుల్లో స్పాట్‌ అడ్మిషన్లు

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల జూనియర్, ఒకేషనల్‌ కాలేజీల్లో 202-25 విద్యా సంవత్సరానికిగానూ మిగిలిన సీట్ల భర్తీకోసం ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకుగానూ జులై 26, 27 తేదీల్లో స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి వర్షిణి ఓ ప్రకటనలో తెలిపారు. జులై 26వ తేదీన బాలికలకు, జులై 2వ తేదీన బాలురకు స్పాట్ అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఆమె వివరించారు..

Gurukula Admissions:పేదింటి విద్యార్ధులకు సువర్ణావకాశం.. 26, 27 తేదీల్లో గురుకుల్లో స్పాట్‌ అడ్మిషన్లు
Gurukula Admissions
Srilakshmi C
|

Updated on: Jul 25, 2024 | 2:07 PM

Share

హైదరాబాద్‌, జులై 25: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల జూనియర్, ఒకేషనల్‌ కాలేజీల్లో 202-25 విద్యా సంవత్సరానికిగానూ మిగిలిన సీట్ల భర్తీకోసం ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకుగానూ జులై 26, 27 తేదీల్లో స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి వర్షిణి ఓ ప్రకటనలో తెలిపారు. జులై 26వ తేదీన బాలికలకు, జులై 2వ తేదీన బాలురకు స్పాట్ అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఆమె వివరించారు.

అడ్మిషన్లు ఎక్కడెక్కడ జరుగుతాయంటే..

స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించే గురుకుల విద్యాలయాల వివరాలను కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. సంబంధిత రీజియన్ల పరిధిలోని బాలికలకు లక్సెట్టిపేట, చింతకుంట, వరంగల్‌ వెస్ట్, టేకులపల్లి, చేవెళ్ల, మెదక్, మహబూబ్‌నగర్‌ (రామిరెడ్డి గూడెం), ధర్మారం, నిడదమానూరు, వలిగొండ బాలికల విద్యాసంస్థల్లో స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయి. బాలురకు బెల్లంపల్లి, పెద్దపల్లి, వర్ధన్నపేట, తిరుమలాయపాలెం, కందుకూరు, హత్నూర యూజీ, జేపీనగర్, భిక్‌నూరు, అనుముల, భువనగిరి బాలుర కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని, అడ్మిషన్లు పొందగోరే విద్యార్ధులు సంబంధిత సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌ రోజున ఆయా గురుకుల కాలేజీలకు హాజరుకావాలని గురుకుల సొసైటీ కార్యదర్శి వర్షిణి సూచించారు.

తెలంగాణ డీఈఈసెట్‌ 2024 టాపర్లు వీరే.. త్వరలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డీఈడీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈసెట్‌ 2024 ఫలితాలు బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17,655 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 15,150 మంది పరీక్ష రాశారు. ఈ నెల 10న జరిగిన ఈ పరీక్ష తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో జరిగింది. ఈ పరీక్షలో మొత్తం 12,032 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు పరీక్ష కన్వీనర్‌ శ్రీనివాసాచారి తెలిపారు. తాజా ఫలితాల్లో తెలుగు మాధ్యమంలో బానోతు నవీన్‌ 77 మార్కులతో ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. ఇంగ్లిష్‌ మాధ్యమంలో వడ్ల వైష్ణవి 80 మార్కులతో, ఉర్దూలో సుమైయా 71 మార్కులతో ఫస్ట్‌ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఇప్పటికే ర్యాంకు కార్డులను కూడా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే గోల్డ్ ధర..
అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే గోల్డ్ ధర..
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..