AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2025 Counselling: నీట్‌ యూజీ 2025 ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆల్‌ ఇండియా కోటా/డీమ్డ్‌/కేంద్ర విశ్వవిద్యాలయాల్లో జులై 30వ తేదీ వరకు నీట్ యూజీ కౌన్సెలింగ్ కొనసాగనుంది. నీట్‌ యూజీ 2025లో అర్హత సాధించిన విద్యార్థులు మెడికల్ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) అధికారిక వెబ్‌సైట్‌ లో కౌన్సెలింగ్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవచ్చు..

NEET UG 2025 Counselling: నీట్‌ యూజీ 2025 ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
NEET UG 2025 counselling
Srilakshmi C
|

Updated on: Jul 24, 2025 | 7:44 PM

Share

హైదరాబాద్‌, జులై 24: దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ యూజీ 2025 కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌లను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) ప్రారంభించింది. నీట్‌ యూజీలో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఆల్‌ ఇండియా, డీమ్డ్‌, సెంట్రల్‌, స్టేట్‌ కోటా సీట్లు ఈ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆల్‌ ఇండియా కోటా/డీమ్డ్‌/కేంద్ర విశ్వవిద్యాలయాల్లో జులై 30వ తేదీ వరకు కొనసాగనుంది. నీట్‌ యూజీ 2025లో అర్హత సాధించిన విద్యార్థులు మెడికల్ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) అధికారిక వెబ్‌సైట్‌ లో కౌన్సెలింగ్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

కాగా ఈ ఏడాది నీట్‌ యూజీ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం 22.09 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. ఇందులో 12.36లక్షల మంది అర్హత సాధించారు. ఆల్‌ ఇండియా కౌన్సెలింగ్‌లో మొత్తం 1.3 లక్షల మెడికల్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సీట్లు దక్కించుకోవాలంటే తప్పనిసరిగా MCC వెబ్‌సైట్‌లో నీట్‌ యూజీ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌ 2025 చేసుకోవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తొలి విడత కౌన్సెలిగ్‌..

  • తొలి విడత కౌన్సెలిగ్‌కు అభ్యర్థులు జులై 21 నుంచి జులై 28వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  • ఫీజు చెల్లింపులకు జులై 28 మధ్యాహ్నం 3గంటల వరకు అవకాశం ఉంటుంది.
  • వెబ్‌ ఐచ్చికాలను ఎంపిక చేసుకొనేందుకు జులై 28వ తేదీ రాత్రి 11.55గంటల వరకు అవకాశం ఉంటుంది.
  • ఛాయిస్‌ లాకింగ్‌ జులై 28న సాయంత్రం 4 గంటలకు మొదలై అదేరోజు రాత్రి 11.55 గంటలతో ముగుస్తుంది.
  • సీట్ల కేటాయింపు ప్రక్రియ జులై 29న ప్రారంభమై జులై 30తో ముగుస్తుంది.
  • తొలిరౌండ్‌ కౌన్సెలింగ్‌ ఫలితాలు జులై 31న విడుదల
  • తొలి రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్ధులు ఆగస్టు 1 నుంచి 6వ తేదీలోగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
  • ఆగస్టు 7, 8 తేదీల్లో జాయిన్‌ అయిన అభ్యర్థుల డేటాను ఎంసీసీ వెరిఫికేషన్‌ చేస్తుంది.

రెండో విడత కౌన్సెలింగ్..

  • ఆగస్టు 9 నుంచి 11 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు
  • ఆగస్టు 12 నుంచి 18 వరకు ఫీజు చెల్లింపులు
  • ఆగస్టు 13 నుంచి 18 వరకు ఛాయిస్‌ ఫిల్లింగ్
  • ఆగస్టు 21 సీట్ల కేటాయింపు ఫలితాలు
  • ఆగస్టు 22 నుంచి 29 వరకు రిపోర్టింగ్‌
  • ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రవేశాలు పొందిన విద్యార్ధుల డేటా వెరిఫికేషన్‌

మూడో రౌండ్‌ కౌన్సెలింగ్‌..

  • సెప్టెంబర్ 2న రిజిస్ట్రేషన్లు
  • సెప్టెంబర్ 3 నుంచి 8 వరకు ఫీజు చెల్లింపులు
  • సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు ఛాయిస్‌ ఫిల్లింగ్‌
  • సెప్టెంబర్ 11 సీట్ల కేటాయంపు ఫలితాలు
  • సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు రిపోర్టింగ్‌
  • సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు విద్యార్ధుల డేటా వెరిఫికేషన్‌

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.