NEET Cutoff Ranks: నీట్‌ MBBS కౌన్సెలింగ్‌లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీటొస్తుందో తెలుసుకోవాలా? ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు

|

Aug 16, 2024 | 8:03 AM

తెలుగు రాష్ట్రాల్లో నీట్‌-2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే నీట్‌ యూజీలో ర్యాంకు పొందిన అభ్యర్ధులు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలంటే గతేడాది కౌన్సెలింగ్‌ తీరుతెన్నులను ఓసారి గమనించి చూడాలి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలో 34, తెలంగాణలో 54 కాలేజీల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు నిర్వహించారు. ఈ సారి నీట్ కౌన్సెలింగ్ లో పాల్గొనే అభ్యర్థులు..

NEET Cutoff Ranks: నీట్‌ MBBS కౌన్సెలింగ్‌లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీటొస్తుందో తెలుసుకోవాలా? ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు
NEET UG 2024 Counselling
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో నీట్‌-2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే నీట్‌ యూజీలో ర్యాంకు పొందిన అభ్యర్ధులు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలంటే గతేడాది కౌన్సెలింగ్‌ తీరుతెన్నులను ఓసారి గమనించి చూడాలి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలో 34, తెలంగాణలో 54 కాలేజీల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు నిర్వహించారు. ఈ సారి నీట్ కౌన్సెలింగ్ లో పాల్గొనే అభ్యర్థులు గత ఏడాది జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలతో పాటు ఏ ర్యాంకుకు ఏ కాలేజీల్లో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో గతేడాది (2023-24) తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌ వివరాలు ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గతేడాది (2023-24) చివరి మెడిక‌ల్ సీటు పొందిన ర్యాంకు/ స్కోరు వివ‌రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో గతేడాది (2023-24) చివరి మెడిక‌ల్ సీటు పొందిన ర్యాంకుల వివ‌రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఈ కింది సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది..

  • నీట్‌ యూజీ-2024 ర్యాంక్‌ కార్డు (రీ రివైజ్‌డ్‌)
  • పుట్టిన తేదీని ధృవీకరించేందుకు పదో తరగతి మార్కుల మెమో
  • 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • ఇంటర్మీడియట్‌ స్టడీ, పాస్‌ సర్టిఫికెట్లు
  • అభ్యర్థి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
  • ఇంటర్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌
  • కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌
  • ఆధార్‌ కార్డు
  • ఇన్‌కాం సర్టిఫికెట్‌
  • దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం

మే5వ తేదీన జరిగిన నీట్‌ పరీక్షకు దేశ వ్యాప్తంగా 23.33లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన సంగతి తెలిసిందే. మొత్తం 720 మార్కులకు ఈ పరీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అన్‌ రిజర్వుడు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు162 మార్కులుగా నిర్ణయించారు. ఏపీలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161 నుంచి 127 మార్కులు కటాఫ్‌గా ప్రకటించారు. ఆ లెక్కగన దాదాపు 43,788 మంది ర్యాంకులు పొందారు. ఇక తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 127 మార్కులు, ఓసీ- పీడబ్ల్యూబీడీ విభాగాల్లో 144 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. మొత్తం 49,143 మందికి ర్యాంకులు వచ్చాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.