
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ విధానంలో యూజీ, పీజీ, పీహెచ్డీ, ఎల్ఎల్బీ పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్లలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద హైదరాబాద్లోని ప్రధాన క్యాంపస్తో పాటు దాని అనుబంధ క్యాపస్లు.. లక్నో, శ్రీనగర్, భోపాల్, దర్భంగా, అసన్సోల్, ఔరంగాబాద్, సంభాల్, నుహ్, బీదర్, బెంగళూరు, కటక్ కూడా ప్రవేశాలు చేపట్టనున్నారు. ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు తప్పనిసరిగా టెన్త్/ఇంటర్/ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మీడియంగా లేదా ఉర్ధూ ఒక సబ్జెక్టుగానైనా చదివి ఉండాలి. లేదంటే ఉర్ధూతో తత్సమాన మదర్సా కోర్సులు ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడి అన్ని కోర్సులు (భాషా కోర్సులు మినహా) కేవలం ఉర్ధూ మీడియంలోనే ఉంటాయి. ఈ కోర్సులన్నింటిలో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ రాయవల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగినవారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, ట్రాన్స్లేషన్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, ఇస్లామిక్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, డెక్కన్ స్టడీస్, ఎడ్యుకేషన్ తదితరాలు.
ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్), ఎంఈడీ, ఎల్ఎల్ఎం.
బీటెక్ (సీఎస్), బీటెక్ (సీఎస్) లేటరల్ ఎంట్రీ, బీఈడీ, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్, ఎల్బీ, బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్).
డీఈఎల్ఈడీ, పాలిటెక్నిక్- డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్- సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్- ఎలక్ట్రానికల్, అటోమొబైల్, అప్పారెల్ టెక్నాలజీ అండ్ పాలిటెక్నిక్- డిప్లొమా లేటరల్ ఎంట్రీ.
ఈ కోర్సుల్లో ప్రవేశాలకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండానే కేవలం అకడమిక్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
MANUU అడ్మిషన్ 2025-26 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.