AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Advanced 2024 Answer Key: కఠినంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. ఆన్సర్‌ కీ విడుదల ఎప్పుడంటే!

దేశవ్యాప్తంగా ఆదివారం (మే 26) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు గానూ ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. గతేడాది జరిగిన పరీక్షతో పోలిస్తే ఈ సారి కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మధ్యస్తం నుంచి కఠినంగా ఉన్నట్లు విద్యార్ధులు చెబుతున్నారు. పేపర్‌ 1 కంటే పేపర్‌ 2 మరికొంత కఠినంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

JEE Advanced 2024 Answer Key: కఠినంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. ఆన్సర్‌ కీ విడుదల ఎప్పుడంటే!
JEE Advanced
Srilakshmi C
|

Updated on: May 27, 2024 | 3:08 PM

Share

హైదరాబాద్‌, మే 27: దేశవ్యాప్తంగా ఆదివారం (మే 26) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు గానూ ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. గతేడాది జరిగిన పరీక్షతో పోలిస్తే ఈ సారి కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మధ్యస్తం నుంచి కఠినంగా ఉన్నట్లు విద్యార్ధులు చెబుతున్నారు. పేపర్‌ 1 కంటే పేపర్‌ 2 మరికొంత కఠినంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్‌ పేపర్‌లోని ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు చెబుతున్నారు. పేపర్‌-1, 2 కలిపి మొత్తం 360 మార్కులకు ఈ పరీక్ష జరిగింది. ఒక్కో పేపర్‌లో మూడు సబ్జెక్టులకు నాలుగు సెక్షన్లలో మొత్తం 51 ప్రశ్నలు చొప్పున ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 17 ప్రశ్నలు వచ్చాయి.

పేపర్‌-1లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో కాస్త ఎక్కువ సమయం తీసుకునేవిగా ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నలు అన్నిటి కంటే కఠినంగా ఉన్నాయి. దీంతో ర్యాంక్‌ కొట్టడంలో కెమిస్ట్రీ కీలకంగా మారనుంది. ఇక మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు మధ్యస్థం నుంచి కఠినంగా ఉండే ప్రశ్నలు వచ్చాయి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ప్రశ్నలు కాస్త సులువుగా ఉన్నప్పటికీ.. ఫిజికల్‌ కెమిస్ట్రీలో మాత్రం క్యాలిక్యులేషన్‌తో కూడిన సుధీర్ఘమైన ప్రశ్నలు వచ్చాయి. మొత్తంమీద ఈ సారీకూడా కటాఫ్‌ గతేడాది మాదిరిగానే ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గతేడాది జనరల్‌ విభాగంలో కటాఫ్‌ మార్కుల 360కు 86గా ఇచ్చారు. ఈసారి పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కటాఫ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈసారి దేశవ్యాప్తంగా ఎంత మంది పరీక్ష రాశారన్న విషయం ఐఐటీ మద్రాస్‌ వెల్లడించలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది రాసి ఉంటారని అంచనా. కాగా క్వశ్చన్‌ పేపర్‌లో ఎన్ని మార్కులకు ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని సెక్షన్లు ఉంటాయి వంటి వివరాలు ముందుగానే విద్యార్ధులకు తెలియజేయలేదు. నిజానికి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రత్యేకత ఇదేనట. అయితే గత మూడేళ్లుగా రెండు పేపర్లకు కలిపి మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. దీన్ని ఐఐటీలు నిర్ణయించి ఉంటాయని భావిస్తున్నారు. కాగా జూన్‌ 2న ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల కానుంది. జూన్‌ 9న ఫలితాలు ప్రకటించి, ర్యాంకులు వెల్లడిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?