
అమరావతి, జులై 7: ఇప్పటికే ఈఏపీసెట్ ఫలితాలు విడుదలవడంతో ర్యాంకుల కేటాంపు కూడా పూర్తయింది. షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి త్వరలోనే కౌన్సెలింగ్కు సంబంధించిన పూర్తి తేదీలను ప్రకటించనుంది. కళాశాలల అనుబంధ గుర్తింపును త్వరగా పూర్తిచేసి, కౌన్సెలింగ్ చేపట్టాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీలకు కనీస ఫీజును రూ.40 వేల నుంచి రూ.47 వేలకు పెంచింది.
2014-19 మధ్య ఇంజనీరింగ్ కనీస ఫీజును రూ.45 వేలకు పెంచిన సర్కార్.. ఆ తర్వాత గత ప్రభుత్వం హయాంలో రూ.35 వేలకు తగ్గించింది. ఈ ఏడాది మళ్లీ ఫీజును రూ.47 వేలకు పెంచారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 140 ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజు రూ.40 వేలుగా ఉంది. అది ఇప్పుడు రూ.47 వేలకు పెరగనుంది. మిగతా కాలేజీలకు పాత ఫీజులే అమలులో ఉంటాయని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఏపీ ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ (APFRMC) ఆయా ఇంజనీరింగ్ కాలేజీల ఆదాయ, వ్యయాలను గణించి రెండు, మూడు నెలల్లో కొత్త ఫీజులను ఖరారు చేయనుంది. ఈ ఫీజులే 2026-27 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపుపై కూడా సర్కార్ పరిమితి విధించింది. గతేడాది సీట్ల సంఖ్యే ఈ ఏడాది కూడా ఉంటాయి.
మరో వారంలో మొదలవనున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కోసం అభ్యర్ధులు ముందుగానే కొన్ని ముఖ్యమైన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవల్సి ఉంటుంది. చివరి నిమిషంలో పరుగులు తీయకుండా ముందుగానే ఈ కింది డాక్యుమెంట్లను రెండు సెట్లు జిరాక్స్ కాపీలు, ఒరిజినల్స్తో సహా రెడీ చేసుకోవడం మంచిది..