విద్యార్థులకు కీలక అప్డేట్.. జూలై 28న స్కూళ్లకు సెలవు..? కారణం ఇదే
రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 28 (మంగళవారం) పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారా? అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది..

దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 28 (మంగళవారం) పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారా? అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. అయితే దేశవ్యాప్తంగా స్కూళ్లకు సాధారణ సెలవు ప్రకటించలేదు. వర్షాల తీవ్రత, వరద పరిస్థితులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లా యంత్రాంగాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాన్ని దాటి లోనికి ప్రవేశించే అవకాశం ఉందని IMD పేర్కొంది. దీని ప్రభావంతో తూర్పు, మధ్య భారతంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్.. రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ-ఎన్సీఆర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, అసోం రాష్ట్రాల్లో కూడా రుతుపవనాలు చురుగ్గా కొనసాగనున్నట్లు IMD తెలిపింది.
జూలై 28న స్కూళ్లకు సెలవు ప్రకటిస్తారా?
ప్రస్తుతం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జూలై 28కు అధికారికంగా పాఠశాలలకు సెలవు ప్రకటించలేదు. సాధారణంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు లేదా స్థానిక పరిపాలన అధికారులు వర్షాల తీవ్రత, రహదారి పరిస్థితులు, వరదలు, విద్యార్థుల భద్రత వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే పాఠశాలలపై నిర్ణయం తీసుకుంటారు.
పరిస్థితులు మరింత దిగజారితే కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అవసరమైతే ఆన్లైన్ తరగతులు నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలించవచ్చు. ముఖ్యంగా తీవ్ర అల్పపీడనం ప్రభావం అత్యధికంగా ఉండే రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. వర్షాల తీవ్రత పెరిగితే ఆయా జిల్లాల అధికారులు పాఠశాలలపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణ పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నీటమునిగిన ప్రాంతాలు లేదా రవాణా అంతరాయం ఏర్పడితే స్థానికంగా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంతో పాటు ముంబై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడే పరిస్థితులు ఏర్పడితే స్థానిక అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా గుజరాత్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు రాత్రి వాతావరణ పరిస్థితులను సమీక్షించిన తర్వాత జిల్లా అధికారులు స్కూళ్లపై నిర్ణయం తీసుకోనున్నారు. కాశ్మీర్ లోయలోని పాఠశాలలు జూలై 27 నుంచి అంటే నేటి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే జమ్మూ డివిజన్లో వర్షాల వల్ల దెబ్బతిన్న పాఠశాల భవనాలను భద్రతా పరిశీలన పూర్తయ్యే వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అవసరమైతే స్థానికంగా తాత్కాలిక సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
స్కూల్ సెలవు ప్రకటించారో లేదో ఎలా తెలుసుకోవాలి?
విద్యార్థులు, తల్లిదండ్రులు కేవలం అధికారిక ప్రకటనలనే నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయ ప్రకటనలు, రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటనలు, పాఠశాల అధికారిక వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీలు, స్కూల్ యాప్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపే అధికారిక సందేశాలు ద్వారా తెలుసుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధృవీకరించని సందేశాలను నమ్మకుండా, అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
