AP SSC and Inter Supply Results: టెన్త్‌, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత.. మరో 4 రోజుల్లో మార్కుల మెమోలు

|

Jun 27, 2024 | 4:49 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 42.54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,33,591 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 56,836 మంది పాసయ్యారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది పాసయ్యారు. బాలురు 72,508 మంది పరీక్షలు రాయగా.. 29,047 (40%) మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 61,083 మంది పరీక్షలు రాయగా.. వారిలో 27,789 (45 శాతం) మంది..

AP SSC and Inter Supply Results: టెన్త్‌, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత.. మరో 4 రోజుల్లో మార్కుల మెమోలు
AP SSC and Inter Suplly Results
Follow us on

అమరావతి, జూన్‌ 27: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 42.54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,33,591 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 56,836 మంది పాసయ్యారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది పాసయ్యారు. బాలురు 72,508 మంది పరీక్షలు రాయగా.. 29,047 (40%) మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 61,083 మంది పరీక్షలు రాయగా.. వారిలో 27,789 (45 శాతం) మంది పాసయ్యారు. ఇక జూన్‌ 18న వెలువరించిన సెకండ్ ఇయర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 74,868 మంది (59 శాతం) ఉత్తీర్ణత పొందారు. 1,27,190 మంది సెకండియర్ పరీక్షలు రాశారు.

పబ్లిక్‌ పరీక్షలు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ కలిపి ఫస్టియర్‌లో 80 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత పొందినట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. సప్లిమెంటరీ ఫలితాల్లో ఎవరికైనా సందేహాలు ఉంటే రీవెరిఫికేషన్‌కు అవకాశం ఇచ్చారు. సమాధాన పత్రాల రీవెరిఫికేషన్‌కు జూన్‌ 28 నుంచి జులై 4 వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్‌ బోర్డు అవకాశం ఇచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. జులై ఒకటి నుంచి షార్ట్‌ మెమోలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.

ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 62 శాతం ఉత్తీర్ణత.. నాలుగు రోజుల్లోనే మార్కుల మెమోలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా మంత్రి నారా లోకేష్‌ బుధవారమే విడుదల చేశారు. టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 62.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,07,883 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 67,115 మంది పాసయ్యారు. 67,740 మంది బాలురు పరీక్షలు రాయగా.. 40,638 (59.99 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. బాలికలు 40,143 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 26,477 (65.96 శాతం) మంది పాసైయ్యారు. మరో నాలుగు రోజుల్లోనే మార్కుల మెమోలను వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఈ సందర్భంగా ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 27 నుంచి జులై 1వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్త కథనాల కోసం క్లిక్‌ చేయండి.