Sainik School Admission 2023-24: ఆరో, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు AISSEE 2023 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే..

|

Oct 26, 2022 | 7:04 AM

కేంద్రప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే సైనిక స్కూళ్లల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగానూ ఆరో తరగతి, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలను ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023)..

Sainik School Admission 2023-24: ఆరో, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు AISSEE 2023 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే..
AISSEE 2023 Notification
Follow us on

కేంద్రప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే సైనిక స్కూళ్లల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగానూ ఆరో తరగతి, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలను ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023) ద్వారా కల్పించడానికి అర్హులైన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 33 సైనిక స్కూళ్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తోంది.

ఈ అర్హతలు ఉండాలి..

ఆరో తరగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధుల వయసు మార్చి 31, 2023 నాటికి 10 నుంచి12 ఏళ్ల మధ్యలో ఉండాలి.
తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందగోరే విద్యార్థుల వయసు మార్చి 31, 2023 నాటికి 13 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉండాలి. 2022-23 విద్యాసంవత్సరంలో ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ అర్హతలతోపాటు ఆసక్తికలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 30, 2022వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ విద్యార్థులు రూ.650లు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆఫ్‌లైన్‌ మోడ్‌లో జనవరి 8, 2023వ తేదీన దేశ వ్యాప్తంగా దాదాపు 180 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే..

అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్.

ఇవి కూడా చదవండి

మొత్తం సీట్ల వివరాలు ఇవి..

రెండు తరగతులకు కలిపి మొత్తం 4786 సీట్లు కేటాయించారు.
ఆరో తరగతికి దాదాపు 4,404 సీట్లు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ- 2894, ప్రైవేటు- 1510 సీట్ల చొప్పున ఉన్నాయి
తొమ్మిదో తరగతికి మొత్తం 382 సీట్లు ఉన్నాయి.

సైనిక స్కూల్‌ ఉన్న రాష్ట్ర విద్యార్థులకు 67 శాతం, ఇతర రాష్ట్రాల వారికి 33 శాతం సీట్లు కేటాయిస్తారు. వీటిల్లో ఎస్సీ కేటగిరీకి15 శాతం, ఎస్టీ కేటగిరీకి 7.5 శాతం, ఇతరులకు 27 శాతం సీట్లు రిజర్వేషన్ ప్రకారం కేటాయిస్తారు. 50.50 శాతం సీట్లలో 25 శాతం మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకు, 25 శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు.

రాత పరీక్ష విధానం..

ఆరో తరగతి ప్రవేశ పరీక్ష మొత్తం 300 మార్కులకుగానూ 125 ప్రశ్నలకు రెండున్నర గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. ఇంటలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ విభాగాల నుంచి 25 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున ఉంటుంది.

తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష మొత్తం 400 మార్కులకు గానూ 150 ప్రశ్నలకు 3 గంటల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ విభాగాల నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలకు, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు.

ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌ లో తెలుసుకోవచ్చు.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.