Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vehicle Scrappage Policy: ఇక నుంచి అలాంటి వాహనాలకు రోడ్లపై నో ఎంట్రీ.. కేంద్రం మరో సంచలన నిర్ణయం

వాహనాల విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది..

Vehicle Scrappage Policy: ఇక నుంచి అలాంటి వాహనాలకు రోడ్లపై నో ఎంట్రీ.. కేంద్రం మరో సంచలన నిర్ణయం
Vehicles
Follow us
Subhash Goud

|

Updated on: Nov 28, 2022 | 8:04 PM

వాహనాల విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పాత వాహనాలను స్క్రాప్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో గడువు తీరిన వాహనాలను స్క్రాప్‌గా మార్చేలా ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు పలు నివేదికలు వెల్లడవుతున్నాయి. దేశంలో కాలుష్యం పెరిగిపోతుండటంతో వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. పాత వాహనాలను రద్దు చేసే పనిలో పడింది. గడువు తీరిన వాహనాలు రోడ్లపై నడుస్తుండటంతో కాలుష్యం పెరిగిపోతోందని భావించిన కేంద్రం.. వాటిని రద్దు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

వచ్చే ఏడాది ఏప్రిల్‌ తర్వాత ఆ వాహనాలు రద్దు:

కాగా, వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్‌ 1 నుంచి దేశంలో 15 సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర నివేదికలు తెలిపాయి. కార్పొరేషన్‌, రవాణా శాఖ బస్సులు, ఇతర వాహనాలకు ఈ కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు తప్పనిసరి వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. రాబోయే 30 రోజుల్లో ఇందుకు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలను తెలుపాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌ comments-morth@gov.in కు పంపించాలని కోరింది. అయితే కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకువచ్చింది.

15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్‌గా మార్చేస్తాం: నితిన్‌ గడ్కరీ

15 ఏళ్లు దాటిన వాహనాలన్నింటిని స్క్రాప్‌గా మార్చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్లు తెలిపారు. పాత వాహనాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అధికారిక ఫైల్‌లో సంతకం కూడా చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ విధానాలను అన్ని రాష్ట్రాలకు పంపినట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కూడా వెహికల్ స్క్రాపేజ్ పాలసీని అమలు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి