Budget 2024: పెళ్లిళ్ల సీజన్‌కు ముందే శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..! బడ్జెట్‌లో ఏది చౌకగా మారిందంటే..

|

Jul 23, 2024 | 1:57 PM

ఈ బడ్జెట్ అభివృద్ధి చెందిన భవిష్యత్తుకు పునాది వేయగలదని.. ఇది 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్‌ను అందిస్తుందన్నారు. ఈ యేడు బడ్జెట్‌ థీమ్‌లో తొమ్మిది అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు..అవేంటంటే..

Budget 2024: పెళ్లిళ్ల సీజన్‌కు ముందే శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..! బడ్జెట్‌లో ఏది చౌకగా మారిందంటే..
Budget 2024
Follow us on

Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై 23న నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో మూడవసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో పెద్ద ప్రకటనలు చేశారు. ఈ సందర్బంగా పెళ్లిళ్ల సీజన్‌కు ముందే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మొత్తం బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, ఏది చౌకగా ఉంటుంది. ఏది ఖరీదైనది అని కూడా ఆమె వివరించారు.

* దేశంలో తయారయ్యే లెదర్, బట్టలు, బూట్లు తక్కువ ధరకే లభిస్తాయి. పాదరక్షలు, తోలు వస్తువుల ధరలు తగ్గుతాయి.

* బంగారం, వెండిపై ఆరు శాతం తక్కువ సుంకం విధించనున్నారు. ప్లాటినంపై సుంకం 6.4 శాతం తగ్గింది.

ఇవి కూడా చదవండి

* మొబైల్ ఛార్జర్‌పై 15 శాతం తగ్గింపు.

* మూడు క్యాన్సర్ మందులపై కస్టమ్ మినహాయింపు అందుబాటులో ఉంటుంది.

* సోలార్ ప్యానెల్స్ కూడా చౌకగా ఉంటాయి.

* ఉక్కు, ఇనుము ధరలు కూడా తగ్గుతాయి.

* క్రూజ్ ప్రయాణం కూడా చౌకగా ఉంటుంది.

* సీ ఫుడ్ ధరలు కూడా తగ్గుతాయి.

* PVC ప్లాస్టిక్ ఇప్పుడు ఖరీదైనది. అలాంటి ప్లాస్టిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచడమే ఇందుకు కారణం.

* సిగరెట్లు కూడా ఖరీదయ్యాయి.

* విమాన ప్రయాణం కూడా మునుపటి కంటే ఖరీదుగా మారి మీ జేబులకు చిల్లుపెట్టనుంది.

* టెలికమ్యూనికేషన్ పరికరాలు కూడా ఖరీదైనవి.

* గరీబ్‌ కల్యాణో యోజనను మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దాంతో 80 కోట్ల మందికిపైగా పేదలు లబ్ధి పొందుతారు.

ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌.. మోదీ ప్రభుత్వం 3.0 లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అభివృద్ధి చెందిన భవిష్యత్తుకు పునాది వేయగలదని.. ఇది 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్‌ను అందిస్తుందన్నారు. ఈ యేడు బడ్జెట్‌ థీమ్‌లో తొమ్మిది అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు..అవేంటంటే..

బడ్జెట్‌ థీమ్‌.. తొమ్మిది అంశాలు

1. వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం

2. ఉద్యోగం, నైపుణ్యాలు పెంచడం

3. మానవ వనరుల అభివృద్ధి-సామజిక న్యాయం

4. తయారీరంగం, సేవలు

5. పట్టణాల అభివృద్ధి

6. ఇంధన భద్రత

7. మౌలిక వసతుల అభివృద్ధి

8. ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి

9. కొత్తతరం సంస్కరణలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి