TVS Bikes: రాయల్ ఎన్ఫీల్డ్తో పోటీ పడనున్న టీవీఎస్.. మార్కెట్లోకి కొత్త బైక్స్!
TVS Bikes: రాయల్ ఎన్ఫీల్డ్, ట్రయంఫ్, హార్లే-డేవిడ్సన్, హోండా వంటి కంపెనీలతో పోటీ పడే 300-400 సిసి బైక్లపై నార్టన్ పనిచేస్తోంది. నార్టన్ రాకకు ఇంకా ఎటువంటి కాలపరిమితి లేదు. కానీ బ్రాండ్ సెప్టెంబర్-అక్టోబర్ నాటికి అధికారికంగా బైక్ను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు..

మీకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టమా? రాయల్ ఎన్ఫీల్డ్ చాలా ఖరీదైనది కాబట్టి మీరు దాన్ని కొనలేరా? అలా అయితే, చింతించకండి. ఎందుకంటే టీవీఎస్ కూడా మార్కెట్లోకి శక్తివంతమైన బైక్ను విడుదల చేస్తోంది. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్తో పోటీ పడుతుందని చెబుతున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి బ్రిటిష్ బ్రాండ్ నార్టన్ బైక్లను భారతదేశానికి తీసుకువస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ ధృవీకరించింది. మే 6న ఇండియా-యుకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఆమోదం పొందిన తర్వాత టీవీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో బ్రిటన్లో తయారయ్యే కార్లు, ద్విచక్ర వాహనాలపై దిగుమతి సుంకాలు 100 శాతం నుండి కేవలం 10 శాతానికి తగ్గుతాయి. దీని వలన నార్టన్ బైక్లు గతంలో కంటే మరింత సరసమైనవిగా మారతాయి.
ఇది కూడా చదవండి: Whatsapp: వాట్సాప్లో కొత్త అప్డేట్.. వినియోగదారులకు ఈ ప్రత్యేక ఫీచర్లు!
మా బ్రిటిష్ బ్రాండ్ నార్టన్ ఈ సంవత్సరం చివర్లో ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించంది. ఆర్థిక సంక్షోభ సమయంలో 2020 లో టీవీఎస్ నార్టన్ బైక్స్ను రూ. 153 కోట్లకు కొనుగోలు చేసింది. భారతీయ బ్రాండ్ నార్టన్తో కలిసి పనిచేసింది. ఈ ప్రక్రియలో రూ. 1,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ తన ప్రస్తుత బైక్ల శ్రేణిని మెరుగుపరచడంతో పాటు కొత్త మోడళ్లను విడుదల చేసిందని కంపెనీ తెలిపింది.
కంపెనీ ప్రీమియం బైక్లు:
కమాండో 961, V4 SV, V4 CR లతో నార్టన్ మోటార్ సైకిళ్ల ప్రీమియం శ్రేణిని ప్రవేశపెట్టిన మొదటి కంపెనీ TVS అవుతుందని భావిస్తున్నారు. ఈ బైక్లు పూర్తిగా నిర్మించిన యూనిట్ల (CBU) రూపంలో వచ్చే అవకాశం ఉంది. UKలోని నార్టన్ సోలిహుల్ ఫ్యాక్టరీలో తయారు అవుతాయి. మేడ్ ఇన్ ఇండియాను ప్రారంభించడానికి ముందు కంపెనీ ఈ బైక్లను బ్రాండ్ బిల్డర్గా ఉపయోగిస్తుంది. 2027 నాటికి 6 కొత్త బైక్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. వాటిలో కొన్ని భారతదేశంలో తయారు అవుతాయి.
రాయల్ ఎన్ఫీల్డ్, ట్రయంఫ్, హార్లే-డేవిడ్సన్, హోండా వంటి కంపెనీలతో పోటీ పడే 300-400 సిసి బైక్లపై నార్టన్ పనిచేస్తోంది. నార్టన్ రాకకు ఇంకా ఎటువంటి కాలపరిమితి లేదు. కానీ బ్రాండ్ సెప్టెంబర్-అక్టోబర్ నాటికి అధికారికంగా బైక్ను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. అది పండుగల సీజన్లో ఉంటుంది. ఇండో-యుకె ఒప్పందం నార్టన్ బైక్స్ భారత మార్కెట్లోకి ప్రవేశించడాన్ని సులభతరం చేసింది. ఈ నిర్ణయం వల్ల ట్రయంఫ్, రోల్స్ రాయిస్, బెంట్లీ, మెక్లారెన్, లోటస్, ఆస్టన్ మార్టిన్, JLR వంటి బ్రాండ్లు ఎంతో ప్రయోజనం పొందుతాయి.
ఇది కూడా చదవండి: RBI New Notes: మార్కెట్లోకి మరో కొత్త నోట్లు.. రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




