Petrol, Diesel Price Today: పెరుగుతోన్న ముడి చమురు ధర.. స్థిరంగా పెట్రోల్, డీజిల్‌ రేట్లు..

|

Jun 22, 2022 | 9:22 AM

Petrol-Diesel Price: అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నా దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతోన్నాయి...

Petrol, Diesel Price Today: పెరుగుతోన్న ముడి చమురు ధర.. స్థిరంగా పెట్రోల్, డీజిల్‌ రేట్లు..
Petrol Diesel Price Today
Follow us on

అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నా దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతోన్నాయి. దీంతో ఆయా కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఫలితంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ షేర్లు ప్రస్తుతం 52 వారాల కనిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. ఇండియన్ ఆయిల్ షేర్ కూడా కనిష్ట స్థాయికి కొద్ది దూరంలోనే ఉంది. ఈ కంపెనీలు రోజూ కోట్లలో నష్టపోతున్నాయి. నష్టాన్ని తగ్గించుకునేందుకు ఉద్దేశపూర్వకంగా పెట్రోల్ పంపులో విక్రయాలు తగ్గించడం వల్ల ఇంధన సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధర బ్యారెల్ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 115 డాలర్లకు చేరువలో ఉంది. దీని వల్ల లీటర్ పెట్రోల్‌పై రూ.10-12, డీజిల్‌పై రూ.23-25 ​​నష్టం వాటిల్లుతోందని కంపెనీలు చెబుతున్నాయి.

చివరిసారిగా మే 21న పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మే 22న దేశవ్యాప్తంగా చమురు ధరల్లో చివరి మార్పు జరిగింది. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.111.35 కాగా, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు. అదే సమయంలో కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది.


తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

ఇవి కూడా చదవండి

* హైదరాబాద్‌లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ మంగళవారం పెట్రోల్‌ రేట్‌ రూ. 109.64గా ఉండగా, డీజిల్‌ రూ. 97.8 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 111.74గా ఉండగా, డీజిల్‌ రూ. 99.49వద్ద కొనసాగుతోంది.

* సాగర నగరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.46గా ఉండగా, డీజిల్‌ రేట్‌ రూ. 98.25గా నమోదైంది.