
పేటీఎం సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆంక్షల నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ఫాస్టాగ్ వినియోగదారులకు కీలకమైన రిమైండర్ ను జారీ చేసింది. 2024, ఫిబ్రవరి 29లోపు ఫాస్టాగ్ కేవైసీ(నో యువర్ కస్టమర్) అప్డేట్ను పూర్తి చేయాలని సూచించింది. లేకపోతే ఫాస్టాగ్ ఖాతా డీయాక్టివేట్ అయిపోయి, బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిపోతుందని హెచ్చరించింది. ఇటీవల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వన్ వెహికల్- వన్ ఫాస్టాగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. అంటే ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ అన్నమాట. దీని వల్ల బహుళ కార్ల కోసం ఒకే ఫాస్ట్ట్యాగ్ని ఉపయోగించడం లేదా ఒకే వాహనంతో బహుళ ఫాస్ట్ట్యాగ్లను అనుసంధానించడం కుదరడం. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ వినియోగదారులు తప్పనిసరిగా ఫిబ్రవరి 29(ఈ రోజు)లోపు తమ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పింది. జాతీయ రహదారులపై సాఫీగా, నిరంతరాయంగా టోల్ చెల్లింపు అనుభవాన్ని అందించడానికి కేవైసీ అప్డేట్ సకాలంలో చేయాలని ఎన్హెచ్ఏఐ సూచించింది.
మీరు ఫిబ్రవరి 29లోపు మీ ఫాస్ట్ట్యాగ్ కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో విఫలమైతే, మీ బ్యాంక్ మీ ఖాతా డీయాక్టివేట్ అవ్వొచ్చు లేదా బ్లాక్లిస్ట్ చేయవచ్చు. ఫలితంగా టోల్ ప్లాజాల వద్ద మీరు దానిని ఉపయోగించలేకపోవచ్చు. ఇది మీ ప్రయాణాలలో అనవసరమైన ఆలస్యం, అసౌకర్యానికి దారి తీస్తుంది.
మీ ఫాస్టాగ్ కేవైసీని అప్డేట్ చేయడం చాలా సులభమైన ప్రక్రియ. అదెలా అంటే..
బహుళ వాహనాలకు ఒకే ఫాస్ట్ట్యాగ్ని ఉపయోగించకుండా చేయడంతో పాటు నిర్దిష్ట వాహనానికి బహుళ ఫాస్ట్ట్యాగ్లను లింక్ చేయకుండా నిరోధించడం ఈ ప్రక్రియ ఉద్దేశం. ఇదే విషయాన్ని ఎన్హెచ్ఏఐ ఈ నెల ప్రారంభంలో తెలిపింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కేవైసీని అప్డేట్ చేయడం ద్వారా వారి తాజా ఫాస్టాగ్ ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయడానికి ఫాస్ట్ట్యాగ్ వినియోగదారులను ప్రోత్సహిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..