Business Ideas: ఇంట్లో దర్జాగా కూర్చుని నెలకు రూ. 1.5 లక్షలు సంపాదించండి..! ఈ ట్రెండింగ్ బిజినెస్ చూస్తే..

ఉద్యోగంతో విసిగిపోయిన చాలామంది ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని చూస్తారు. మరి అలాంటి వారి కోసం ఓ బిజినెస్ ఐడియాను తీసుకొచ్చేశాం. ఆ బిజినెస్ ఏంటి.? మరి అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి. ఆ వివరాలు ఇలా..

Business Ideas: ఇంట్లో దర్జాగా కూర్చుని నెలకు రూ. 1.5 లక్షలు సంపాదించండి..! ఈ ట్రెండింగ్ బిజినెస్ చూస్తే..
Money

Updated on: Jan 16, 2026 | 9:03 AM

ఏటీఎం బిజినెస్ ద్వారా ఇంట్లో కూర్చొని నెలకు రూ. లక్షల్లో సంపాదించవచ్చు. రూ. 5 లక్షల పెట్టుబడితో.. రోజుకు 300 లావాదేవీలు జరిగితే, నెలకు రూ. 1.5 లక్షల వరకు మీ సొంతం. అదెలాగో ఇప్పుడు చూసేద్దాం. వివరాల్లోకి వెళ్తే..! ఏటీఎం బిజినెస్ ద్వారా ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించుకునే అవకాశం ఇది. కేవలం రూ. 5 లక్షల పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. ప్రతి ఒక్క ట్రాన్సక్షన్‌కు రూ. 20 కమిషన్ అందుతుంది. ఇది కూల్‌గా మనకొచ్చే ఆదాయం.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

ఒక అంచనా ప్రకారం, రోజుకు 300 లావాదేవీలు జరిగితే, రోజువారీ లాభం రూ. 6 వేల వరకు వస్తుంది. అలా చూసుకుంటే నెల అయ్యేసరికి రూ. 1.80 లక్షలు లాభం వచ్చినట్టు. నెలవారీ ఖర్చులు రూ. 30 వేలు పక్కన పెడితే.. నికర లాభం రూ. 1.50 లక్షల వరకు ఉండవచ్చు. సంవత్సరానికి సుమారుగా రూ. 18 లక్షల లాభం పొందే అవకాశం ఉంది. అయితే ఈ లెక్కలు కేవలం అంచనా మాత్రమే. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినా.. మార్కెట్ పరిస్థితులు, పలు వివిధ అంశాల ద్వారా లాభం ఆధారపడి ఉంటుంది. మీరు ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా.. ఫస్ట్ దానిపై రీసెర్చ్ చేసి.. మార్కెట్ పరిస్థితులను గమనించాల్సి ఉంటుంది. అటు బంగాళదుంప చిప్స్ బిజినెస్ కూడా ఇప్పటి పరిస్థితుల్లో ట్రెండింగ్ అని చెప్పొచ్చు. దీనికి ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ వస్తుంది. సరైన మార్కెటింగ్, క్వాలిటీ మెయింటైన్ చేస్తే కచ్చితంగా ఈ బిజినెస్‌లో మనం మంచి లాభాలను పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి