AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్‌ నష్టాల్లో ఉన్నా.. పెట్టుబడిదారులకు మంచి లాభాలు ఇచ్చిన పెన్సీ స్టాక్స్‌!

గురువారం దలాల్ స్ట్రీట్‌లో భారీ పతనం నమోదైంది. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా, నిఫ్టీ 350 పాయింట్లు కోల్పోయింది. అయితే, ఇండియాబుల్స్ ఎంటర్‌ప్రైజెస్ 10 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి, పెట్టుబడిదారులకు ఆశాజనక లాభాలను అందించింది. బలమైన Q4 ఆర్థిక ఫలితాలు, రియల్ ఎస్టేట్‌పై దృష్టి, స్టాక్ బ్రోకింగ్ వ్యాపారాలు ఈ అసాధారణ వృద్ధికి కారణమయ్యాయి.

మార్కెట్‌ నష్టాల్లో ఉన్నా.. పెట్టుబడిదారులకు మంచి లాభాలు ఇచ్చిన పెన్సీ స్టాక్స్‌!
Stock Investment
SN Pasha
|

Updated on: Apr 30, 2026 | 8:49 PM

Share

గురువారం దలాల్ స్ట్రీట్ లో పెట్టుబడిదారులకు భారీ నిరాశ నెలకొంది. గ్లోబల్ సంకేతాలు బలహీనంగా ఉండటంతో పాటు, దేశీయ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ప్రధాన సూచీలు గణనీయంగా పతనమయ్యాయి. BSE సెన్సెక్స్‌ 1,200 పాయింట్లకు పైగా క్షీణించి 76,259 వద్ద ముగియగా, నిఫ్టీ 50 కూడా దాదాపు 350 పాయింట్లు కోల్పోయింది. మార్కెట్ మొత్తం ఎర్రగా మారిన ఈ పరిస్థితిలో ఒకే ఒక్క స్టాక్ మాత్రం పెట్టుబడిదారులకు ఆశాజనక లాభాలను అందించింది.

ఆ స్టాక్ ఇండియాబుల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్. గురువారం ఈ షేర్ 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.19.70 వద్ద లాక్ అయింది. ముఖ్యంగా ఫిబ్రవరి 2026లో రూ.8.93 వద్ద నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి నుంచి ఇది 120 శాతం పైగా ర్యాలీ సాధించడం విశేషం. ప్రస్తుతం ఈ ధర అక్టోబర్ 2025లో నమోదైన రూ.20.91 గరిష్టానికి కేవలం 6 శాతం దూరంలోనే ఉంది. గత ఒక నెలలోనే 115 శాతం పెరుగుదల నమోదు చేయడం, మూడు నెలల్లో 85 శాతం రాబడి ఇవ్వడం ఈ స్టాక్‌పై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచింది.

ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కంపెనీ ప్రకటించిన బలమైన ఆర్థిక ఫలితాలే. మార్చి త్రైమాసికంలో సంస్థ పన్ను అనంతర లాభం 46.4 శాతం పెరిగి రూ.194 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం రూ.418 కోట్లుగా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.880 కోట్ల ఆదాయంపై రూ.346 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. దాదాపు 39.3 శాతం లాభ మార్జిన్ సాధించడం సంస్థ కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. విలీనం తర్వాత రియల్ ఎస్టేట్‌పై దృష్టి పెట్టిన వ్యూహం కూడా ఫలితాలను ఇస్తోంది. నాలుగో త్రైమాసికంలో ఈ విభాగం రూ.143 కోట్ల ఆదాయాన్ని అందించగా, మొత్తం సంవత్సరంలో 909 యూనిట్ల అమ్మకాలతో రూ.2,752 కోట్ల బుకింగ్‌లు నమోదయ్యాయి. అదనంగా స్టాక్ బ్రోకింగ్, ఆస్తుల పునర్నిర్మాణ వ్యాపారాలు కూడా బలంగా కొనసాగుతున్నాయి. మార్కెట్ మొత్తం క్షీణించిన రోజున కూడా ఈ స్టాక్ మెరిపించడం పెట్టుబడిదారుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us