26 April, 2026
Subhash
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ లైసెన్స్ను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం, ఇకపై ఈ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుండదు.
బ్యాంక్ పనితీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందని, ఇది ఖాతాదారులు మరియు సాధారణ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని RBI పేర్కొంది.
పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్కు సంబంధించిన పలు కీలక షరతులను పాటించడంలో పేటీఎం బ్యాంక్ విఫలమైందని కేంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది.
గతంలోనే (మార్చి 2022లో) కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఈ బ్యాంక్పై RBI నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్లు స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలు, వాలెట్ టాప్-అప్లపై ఉన్న ఆంక్షలు ఇప్పుడు లైసెన్స్ రద్దుకు దారితీశాయి.
తాజా నిర్ణయంతో కొత్త లేదా పాత కస్టమర్లకు ఎలాంటి ప్రామాణిక బ్యాంకింగ్ సేవలను అందించే అధికారాన్ని పేటీఎం బ్యాంక్ కోల్పోయింది.
ఈ పరిణామం పేటీఎం బ్యాంక్ ఖాతాదారులు, వాలెట్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.