AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఆ 4 బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా.. కారణం ఏంటంటే..!

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిబంధనలు పాటించని బ్యాంకులకు షాకిస్తోంది. అలాంటి బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది...

RBI: ఆ 4 బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా.. కారణం ఏంటంటే..!
Subhash Goud
|

Updated on: Apr 12, 2022 | 8:22 AM

Share

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిబంధనలు పాటించని బ్యాంకులకు షాకిస్తోంది. అలాంటి బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. ఇప్పటికే ఎన్నో బ్యాంకుల (Banks)పై జరిమానా విధించిన ఆర్బీఐ.. తాజాగా మరో నాలుగు సహకార బ్యాంకు (Co-operative Banks)లపై విధించింది. జరిమానా మొత్తం రూ.4 లక్షలు. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. రెగ్యులేటరీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించనందుకు ఈ సహకార బ్యాంకులపై జరిమానా విధించబడింది. మార్గదర్శకాలను పాటించని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటారు. జరిమానాలతో పాటు ఆంక్షలు కూడా విధిస్తోంది ఆర్బీఐ. అయితే ఈ నాలుగు సహకార బ్యాంకులపై జరిమానా విధించినప్పటికీ, ఖాదారుల లావాదేవీలు, ఖాతాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.

అండర్సుల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ రూ.1.50 లక్షల జరిమానా విధించింది. అలాగే మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో నడుస్తున్న మహేశ్‌ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ. లక్ష జరిమానా, అదేవిధంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్న నాందేడ్ మర్చంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ రూ.50,000, మరో సహకార బ్యాంకుతో కలిపి మొత్తం నాలుగు బ్యాంకులకు ఈ జరిమానా విధించింది.

రిజర్వ్ బ్యాంక్ ప్రకారం, ‘బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎక్స్‌పోజర్ నిబంధనల’ మార్గదర్శకాలను పాటించనందుకు సహకార బ్యాంకులకు జరిమానా విధించబడింది. షాడోల్‌కు చెందిన జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మర్యాడిట్‌పై రూ.లక్ష జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 నిబంధనలను ఉల్లంఘించింది. అలాగే, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్ 2014, KYC సూచనలను అనుసరించని కారణంగా రిజర్వ్ బ్యాంక్ చర్య తీసుకుంది.

ఈ రెండు బ్యాంకులపైనా చర్యలు

రెండు రోజుల క్రితం నో యువర్ కస్టమర్ (KYC) మార్గదర్శకాలతో సహా అనేక నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్‌పై RBI రూ. 93 లక్షల జరిమానా విధించింది. అలాగే ఐడీబీఐ బ్యాంకుపై ఆర్బీఐ రూ.90 లక్షల జరిమానా విధించింది. యాక్సిస్ బ్యాంక్ కొన్ని సూచనలను పాటించనందుకు రూ.93 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

యాక్సిస్ బ్యాంక్ రుణాలు, KYC మార్గదర్శకాలు, ‘పొదుపు ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించనందుకు జరిమానా ఛార్జీలు విధించింది. వాణిజ్య బ్యాంకులు, సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌ల ద్వారా మోసాలను వర్గీకరించడం, నివేదించడం’పై ఆదేశాలను పాటించనందుకు IDBI బ్యాంక్‌కి RBI జరిమానా విధించింది.

ఇవి కూడా చదవండి:

EPFO Update: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీని అప్‌డేట్‌ చేయడం ఎలా..?

Whatsapp: మీ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ యాప్‌కు లాక్‌-అన్‌లాక్‌ చేయడం ఎలా..?